కార్ల ఎగుమతికి చెన్నైను ఆధారం చేసుకోనున్న టీఎన్ సర్కార్
ఫోర్డ్, హ్యూందాయ్, బీఎమ్డబ్ల్యూ, రెనో మరియు నిసాన్ వంటి కార్లను ఎగుమతి చేసేందుకు తమిళనాడు సర్కార్ తన రాజధాని నగరమైన చెన్నైను ఆధారం చేసుకోనుంది.
రెనో, నిసాన్ మరియు కొరియా ఆటో మేకర్ హ్యూందాయ్లను షిప్పింగ్ చేయడంతో చెన్నై చిన్న కార్ల ఎగుమతిలో ప్రపంచంలో పేరు సాధించనుందని తమిళనాడు రాష్ట్ర పారిశ్రామిక మంత్రి తంగమని వెల్లడించారు.

ప్రతి ఏడాది 13.8 లక్షల కార్లు మరియు 3.61 లక్షల కమర్షియల్ వాహనాలు ఉత్పత్తి చేయగల సామర్థ్యం చెన్నైకు ఉంది. దీని బట్టి చూస్తే ప్రతి నిమిషానికి మూడు కార్లు, ప్రతి 90 సెకండ్లకు ఒక కమర్షియల్ వాహనం తయారవుతోంది.
దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ హ్యూందాయ్ రెండు ప్లాంట్లను కలిగి భారత్లో అతి పెద్ద ఎగుమతిదారునిగా నిలిచింది. నిసాన్ 5 సంవత్సరాలుగా 5లక్షల వాహనాలను ఎగుమతి చేసింది.
మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్స్పార్క్.......


Click it and Unblock the Notifications








