కొత్త ఎత్తుగడతో భారతీయ మార్కెట్లో 720 కోట్ల పెట్టుబడిపెడుతున్న వోక్స్వ్యాగన్
జర్మనీకి ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం వోక్స్వ్యాగన్ గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త వినాల్సి వస్తోంది. కాని ఈ సారి శుభవార్త తెలిపింది. వోక్స్వ్యాగన్ సంస్థ భారతీయ మార్కెట్లోకి ఒక కాంపాక్ట్ సెడాన్ను విడుదల చేయాలని పథకం రచించింది. అందుకోసం ప్రత్యేకంగా దీనిని కోసం దాదాపుగా 720 కోట్లను భారత్లో పెట్టుబడి పెడుతోంది.
Also Read: మహీంద్రా నుండి ఎక్స్యువి500 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్
2014 లో వోక్స్వ్యాగన్ కంపెనీ చెప్పిన విధంగా ఈ మొత్తం 720 కోట్ల రుపాయలును 1500 కోట్ల బడ్జెట్లో భాగంగా ఇప్పుడు రీసెర్చ్ కోసం విడుదల చేసినట్లు తెలిపింది. దేశీయంగా తయారు చేయబోతున్న కాంపాక్ట్ సెడాన్ కోసం ఈ మొత్తాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. త్వరలో ఈ కాంపాక్ట సెడాన్ను భారతీయ మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
Also Read: కొత్తతరం టయోటా ఇన్నోవా: ఫోటోలు మరియు స్పెసిఫికేషన్స్.
ముఖ్యంగా ఈ వోక్స్వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ కారును ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హోండా అమేజ్ మరియు హ్యుందాయ్ జెంట్ మోడల్ కార్లకు పోటిగా దీనిని తీసుకురానున్నారు. ఈ వోక్స్వ్యాగన్ కాంపాక్ట్ సెడాన్ కారును పూనేలో గల చకన్ ప్లాంటులో దీనిని అభివృద్దిని ప్రారంభించారు.



Click it and Unblock the Notifications








