సాక్షిమాలిక్ సాధించిన పతకానికి గుర్తుగా గిఫ్ట్ ప్రకటించిన ఆనంద్ మహీంద్రా
రియో ఒలంపిక్స్ 2016 ఎంతో ఘణంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఎంతో మందికి పతకాల పంట పండుతుండగా మరింకొందరు తమ అదృష్టాన్ని మళ్లీ పరీక్షించుకుందాములే అని ఉసూరుమంటున్నారు.
రియో ఒలంపిక్స్ ప్రారంభమైనప్పటి నుండి ఎంతో మంది అథ్లెంట్లు పతకాలను తమ దేశాలకు ఎగురేసుకుపోతున్నారు. ఇందులో యావత్ భారత్ గర్వించదగ్గ విధంగా రెజ్లింగ్ ద్వారా ఒలంపిక్స్ నుండి మొట్టమొదటి పతకాన్ని సాధించింది. ఆనంద్ మహీంద్రా గారు సాక్షి మాలిక్ సాధించిన విజయానికి గుర్తుగా థార్ ఎస్యువిని బహుమానంగా ప్రకటించారు.

యావత్ ప్రపంచం మొత్తం ఒలంపిక్స్ లోని రెజ్లింగ్లో పండే పతకాల పంట కోసం వేచి చూస్తున్నరు.అందులో మహీంద్రా గ్రూప్ చైర్మెన్ ఆనంద్ మహీంద్రా కూడా ఒకరు. అయితే సాక్షిమాలిక్ కాంస్య పతకం సాధించిన వెంటనే తన ట్విట్టర్ ఖాతా ద్వారా #TharForSakshi అనే హ్యాష్ట్యాగుతో ఆమెకు థార్ జీపును బహుకరిస్తున్నట్లు తెలిపాడు.

ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మహీంద్రా ఛీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వివేక్ నాయర్కు, సాక్షి మాలిక్ కోరిన రంగులో ఆమెకు నచ్చిన విధంగా మోడిఫికేషన్ చేయిచి ఒక థార్ ఎస్యువిని బహుకరించాలని కోరాడు.

మహా భారత దేశంలో మిగతా అందరి రాజకీయ, వ్యాపార, స్పోర్ట్స్ దిగ్గజాలుగా కాకుండా సాక్షి మాలిక్ పతకాన్ని సాధించిన వెంటనే తన భావాలను వెంటనే ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు ఆనంద్ మహీంద్రా గారు.

దేశీయంగా క్రీడాకారులను ప్రోత్సహించే వారిలో ఆనంద్ మహీంద్రా గారు కూడా ఒక్కరు అని చెప్పవచ్చు.

2016 రియో ఒలంపిక్స్ విజయం సాధించినందుకు గాను హర్యానా ప్రభుత్వం సాక్షి మాలిక్కు సుమారుగా 2.5 కోట్ల రుపాయల ప్రైజ్ మనీని ప్రకటించింది.
ఆనంద్ మహీంద్రా గారు సాక్షి మాలిక్కు థార్ ఎస్యువిని బహుమానంగా ప్రకటిస్తున్న తెలిపిన ట్విట్టర్ సందేశం.

ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికరమైన విషయాలు


Click it and Unblock the Notifications








