రిపోర్ట్: 100 బిలియన్ డాలర్ల వరకు లభ్ది పొందనున్న ఆల్కహాలిక్ ఇండస్ట్రీలు
మద్యం సేవించి వాహనం నడపకండి, తాగి నడిపితే జరిమానా, జైలు శిక్ష మరియు వింత వింత శిక్షలు కూడా అమలు చేస్తున్నారు. దీని ద్వారా మద్యం పరిశ్రమకు కోట్లకు కోట్లు నష్టం వాటిలళ్లుతోంది. దీని వలన ఎక్కువ అనర్థాల జరుగుతుండటం వలన చాలా వరకు డ్రింక్ అండ్ డ్రైవ్ను నిషేధించారు.
అయితే మద్యం పరిశ్రమలకు ఒక శుభవార్త, ఆటోమొబైల్ పరిశ్రమ ద్వారా రానున్న రోజుల్లో మద్యం పరిశ్రమలకు సుమారుగా 100 బిలియన్ అమెరికన్ డాలర్ల వరకు లభ్ది చేకూర్చనుంది. .

ప్రస్తుత కాలంలో సెల్ఫ్ డ్రైవ్ కార్ల మీద రీసెర్చ్లు చాలా అధికంగా జరుగుతున్నాయి. ఎపుడైనా ఈ అటానమస్ కార్లు రోడ్డెక్కనున్నాయి. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే మత్తులో ప్రమాదాలు సృష్టిస్తున్నారు అనే ఉద్దేశ్యంతో ప్రభుత్వాలు మద్యం సేవించి వాహనం నడపడాన్ని నిషేధిస్తున్నాయి.
Also Read: అలర్ట్: ఈ డ్రైవింగ్ హ్యాబిట్స్ మీ కార్ ని డేంజర్ లో పడేస్తాయి ..!!
అదే డ్రైవర్ లెస్ కార్లు అందుబాటులోకి వస్తే మనిషి అవసరం లేకుండా కార్లు నడుస్తాయి. కాబట్టి అందులో ప్రయాణించే వారికి డ్రైవ్ చేసే సమస్య తప్పతుంది. ఇక మత్తులో డ్రైవ్ చేయాల్సి వచ్చింది అనే బాధ తప్పుతుంది.
Also Read: స్టీరింగ్ పట్టే విధానం మీ వ్యక్తిత్వాన్ని ఏమని తెలుపుతోంది ?
తద్వారా మద్యం సేవించి కూడా అటానమస్ కార్లలో ప్రయాణించవచ్చు. కాబట్టి మద్యం పరిశ్రమకు మరింత లభ్ది చేకూరనుంది. మోర్గాన్ స్టేన్లీ బృందం ప్రకారం 2025 నాటికి ఇది కార్యరూపం దాల్చనుంది.
Also Read: ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారికి వింత శిక్షలు: తెలంగాణ
ఇండియలో ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే 2025 కన్నా ఎక్కువ సమయమే పట్టనుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా మద్యం సేవించి డ్రైవింగ్ చేయాల్సి వచ్చినపుడు ఏం చేస్తారు ? కారు షేరింగ్ సర్వీసు ద్వారా ఇంటిని చేరుకోండి... లేదా మద్యం సేవించని స్నేహితునికి ఫోన్ చేసి ఇంటి వద్ద దిగబెట్టమని కోరండి.


Click it and Unblock the Notifications








