దేశ రాజధాని కోసం 7 సిరీస్ను తీసుకొస్తున్న బిఎమ్డబ్ల్యూ
జర్మనీకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ బిఎమ్డబ్ల్యూ 7 సిరీస్ లగ్జరీ సెడాన్ వేరియంట్ను ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్ కోసం దిగుమతి చేసుకుంటోంది. ఇది ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని ప్రాంత పరిధిలోని వినియోగదారులను ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

బిఎమ్డబ్ల్యూ ప్రయోగాత్మక పరీక్షల అనంతరం ఈ 725ఎల్డి ను దేశీయంగా దిగుమతి చేసుకుంటోంది, ఇందులో 1995 సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో 2000 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. అయితే 2,000 కన్నా తక్కువ సీసీ ఉడటం వలన దీనిని ఢిల్లీలో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
బిఎమ్డబ్ల్యూ ఈ 7 సిరీస్ కారు 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. మరియు ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్ నుండి నాలుగు ఎస్-క్లాస్ కార్లు ఈ 7-సిరీస్ కు పోటీగా ఉన్నాయి.
బిఎమ్డబ్ల్యూ 730ఎల్డి డిజైన్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరియు 730ఎల్డి ఎమ్ స్పోర్ట్ రెండు కూడా 3 లీటర్ ఆరు సిలిండర్ల టర్బో ఛార్జ్డ్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 265 బిహెచ్పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
ఇండియా నుండి 10 ఇతర దేశాలకు ఉన్న రైలు మార్గాలు
బిఎమ్డబ్ల్యూ ఈ 7 సిరీస్లోని పెట్రోల్ వేరియంట్లు 750ఎల్ఐ మరియు 750 ఎల్ఐ ఎమ్ వేరియంట్లలో 4.4 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్ కలదు, ఇది సుమారుగా 450 బిహెచ్పి పవర్ మరియు 650 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేయగలదు.
బిఎమ్డబ్ల్యూ ఈ 7 సిరీస్ ఉత్పత్తులను అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది. మరిన్ని ఆటో మొబైల్ కథనాల కోసం తెలుగు డ్రైవ్స్పార్క్తో కలిసి ఉండండి.


Click it and Unblock the Notifications




























