ఆంధ్రా ప్లాంట్ నుండి మొదటి పికప్ ట్రక్ను ఉత్పత్తి చేసిన ఇసుజు
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సిటిలో గల తయారీ ప్లాంట్ నుండి ఇసుజు మోటార్స్ మొదటి డి-మ్యాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్కును ఉత్పత్తి చేశారు. ఏప్రిల్ 27, గురు వారం నాడు ఈ వి-క్రాస్ పిక్ప్ వాహనాన్ని ఉత్పత్తి చేసినట్లు ప్రకటించారు. ఈ వాణిజ్య వ్యాపార వాహనాన్ని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించారు.

ప్రస్తుతం ఇసుజు మోటార్స్కు శ్రీ సిటిలో ఉన్న తయారీ ప్లాంట్ను దాదాపుగా 3,000 కోట్లు పెట్టుబడితో అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ ప్లాంట్ ద్వారా సుమారుగా 3,000 మంది వరకు ఉద్యాగాలు కల్పించారు.

శ్రీ సిటిలో ఇసుజు ప్లాంట్ సుమారుగా 107 ఎకరాల విస్తీర్ణంలో కలదు.

ప్రస్తుతం ఈ ప్లాంటు ద్వారా ఏడాదికి 50,000 యూనిట్ల వరకు ఉత్పత్తి చేయవచ్చు. దీనిని 1,20,000 లకు పెంచాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.

డి-మ్యాక్స్ వి-క్రాస్ పికప్ ట్రక్కు గురించి
ఈ పికప్ ట్రక్కులో ఇసుజు మోటార్స్ 2.5-లీటర్ కెపాసిటి గల సిఆర్డిఐ టర్బో ఛార్జ్డ్ డీజల్ ఇంజన్ను అందించారు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 134 బిహెచ్పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

ఇందులోని ఇంజన్కు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ను అనుసంధానం చేశారు.

డ్రైవ్ సిస్టమ్
ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ ట్రక్కులోని నాలుగు చక్రాలకు అందుతుంది. ఇందు కోసం ఫోర్ వీల్ డ్రైవ్ వ్యస్థను వినియోగించారు.

ధర
ఇసుజు మోటార్స్ వారి వి-క్రాస్ పికప్ ట్రక్కు దేశీయంగా ప్రారంభ ధర సుమారుగా రూ. 15 లక్షల వరకు ఉన్నట్లు తెలిసింది.

బెంజ్ కార్ల కోసం వేచి ఉండడు.... ఆటో రిక్షాల్లో కూడా ప్రయాణిస్తాడు: అజీమ్ ప్రేమ్జీ
చిత్తూరు హీరో ప్లాంట్ మీద మరో 3000 కోట్లు: వచ్చే నెలలో శకుస్థాపన చేయనున్న ఏపి సిఎం


Click it and Unblock the Notifications








