జెనిసిస్ లగ్జరీ కారును ఆవిష్కరించున్న హ్యుందాయ్ మోటార్స్
హ్యుందాయ్ మోటార్స్ వారు అత్యంత ఖరీదైన లగ్జరీ కారు జెనిసిస్ జి90 ను అతి త్వరలో ప్రారంభంకానున్న 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది.

హ్యుందాయ్ మోటార్స్ వారు అందిస్తున్న ఈ జెనిసిస్ జి90 కారులో 3.8-లీటర్ కెపాసిటి గల వి6 పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 231 బిహెచ్పి పవర్ మరియు 396 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. మరియు టాప్ వేరియంట్లో గల 5.0-లీటర్ వి8 ఇంజన్ 311 బిహెచ్పి పవర్ మరియు 519 ఎన్ఎమ్ అత్యధిక టార్క్ను విడుదల చేయును.
ఇంటీరియర్ లోపల ఉత్తమ నాణ్యత గల లెథర్ అప్ హోల్స్ట్రై సీట్లు, 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ మరియు బయట నుండి తక్కువ శబ్ధం వినబడకుండా ఉండేందుకు రెండు లేయర్లతో గల అద్దాలను కల్పించారు. ఇక పోతె వెనుక సీట్లను రెండుగా విభజించే సెంటర్ కన్సోల్ను ఏర్పాటు చేశారు. సెంటర్ కన్సోల్ ద్వారా అన్నింటి ఎలక్ట్రానికల్ గా అపరేట్ చేయవచ్చు.
Also Read: హ్యుందాయ్ మోటార్స్ భారత్కు తీసుకువస్తున్న ఎలంట్రా కారు గురించి మరిన్ని వివరాలు
హ్యుందాయ్ మోటార్స్ వారు ఈ జెనిసిస్ జి90 కారుతో పాటు టస్కన్ ఎస్యువి మరియు కొత్త ఎమ్పివి మరియు తరువాత తరానికి చెందిన ఎలంట్రా కార్లను అతి త్వరలో ప్రారంభం కానున్న 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది.


Click it and Unblock the Notifications




























