ఒలంపిక్స్ విజేతలకు రెడి గో కార్లను బహుకరించనున్న డాట్సన్
ప్రస్తుతం రియో ఒలంపిక్స్లో భారత అథ్లెంట్లు పతకాలు సాధించడం కోసం తీవ్రంలో పోటీ పడుతున్నారు. అందులో కొంత మంది భారత్ గర్వించే విధంగా పతకాలను కూడా సాధించారు. ఒలంపిక్స్ల పతకాలు సాధించిన అథ్లెట్లకు డాట్సన్ సంస్థ రెడి గో కార్లను బహుకరించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైయివేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా మాట్లాడుతూ డాట్సన్ వారు ఒలంపిక్స్లో పథకాలు సాధించిన అథ్లెట్లకు రెడి గో కార్లను ప్రెసెంట్ చేయనున్న ప్రకటనను ఖచ్చితం చేశారు.

దేశీయంగా యువతను ఉత్తేజపరిచి ఇలాంటి ఎన్నో పతకాలను సాధించడానికి వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కూడా ఈ సందర్భంగా తెలిపారు.

ప్రస్తుతం జరిగిన 2016 రియో ఒలంపిక్స్లో పతకాలు సాధించిన పి.వి.సింధు, సాక్షి మాలిక్ మరియు దీపా కర్మాకర్లకు డాట్సన్ రెడి గో కార్లను బహుకరించనుంది.

అంతే కాకుండా ఒలంపిక్స్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇండియన్ అథ్లెట్లకు కూడా డాట్సన్ వారి హ్యాచ్బ్యాక్లను అందివ్వనున్నారు.

మహిళలు పతకాలను సాధించుకురావడాన్ని డాటర్ ఆఫ్ కంట్రీ గా భావిస్తూ డాట్సన్ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది.

ప్రస్తుతం డాట్సన్ #ISayYes అనే హ్యాష్ట్యాగ్తో క్యాంపెయిన్ను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది దేశ వ్యాప్తంగా ఉన్న యువత వారి లక్ష్యాలను చేరడం కోసం ఈ క్యాంపెయిన్ను నడుపుతున్నట్లు తెలిపారు.

అథ్లెట్లకు బహుకరిస్తున్న డాట్సన్ రెడి గో హ్యాచ్బ్యాక్లో 799సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ గల గేర్బాక్స్ను అనుసంధానం చేశారు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 53బిహెచ్పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయగలదు. ఏఆర్ఏఐ ప్రకారం ఇది లీటర్కు 25.17 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

ప్రేతాత్మలకు నిలయాలుగా మారిన ఇండియన్ రైల్వే స్టేషన్లు
పాంబన్, రామేశ్వరాలను కలిపే రైలు వంతెన గురించి మీకు నిజాలు


Click it and Unblock the Notifications








