ధరల పెంపు బాటలో ఇసుజు ఇండియా
ఇసుజు ఇండియా లైనప్లోని ఉత్పత్తుల పై ధరలను పెంచింది. పెంచిన ధరలు జనవరి 1, 2017 నుండి అమలుకానున్నాయి.
2017 ఏడాదిని వేదికగా చేసుకుని ఇప్పటికే అనేక కార్ల తయారీ సంస్థలు ధరల పెంపును చేపట్టాయి. దేశీయంగా ఉన్న అనేక సంస్థలు తమ ఉత్పత్తులపై ధరల పెంపును ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాహ జపాన్కు చెందిన వాహన తయారీ సంస్థ ఇసుజు తమ ఉత్పత్తుల మీద ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఇసుజు లైనప్లో ఉన్న డి-మ్యాక్స్ వి-క్లాస్ మరియు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ ఉత్పత్తుల మీద మూడు నుండి నాలుగు శాతం మేరకు ధరలను పెంచాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఇసుజు ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రస్తుతం ఇసుజు డి-మ్యాక్స్ ఎస్-క్యాబ్ ధర రూ. 7.87 లక్షలు మరియు డి-మ్యాక్స్ వి-క్రాస్ ధర రూ. 12.8 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి. అయితే ధరల పెంపు అనంతరం సవరణలు జరిగిన కొత్త ధరలు 2017 జనవరి 1 నుండి అమల్లోకి రానున్నాయి.

ధరల పెంపుకు గల కారణాలను పరిశీస్తే దాదాపు అన్ని సంస్థలు కూడా ఒకే అంశాన్ని వెల్లడిస్తున్నాయి. పెట్టుబడి వ్యయాలు పెరగడం మరియు తయారీ మీద ఆర్థిక భారం ఎక్కువవుతున్న నేపథ్యంలో ధరలను పెంచాల్సి వస్తోందని చెబుతున్నాయి.

ఆంధ్ర ప్రదేశ్లో వాహన తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్ర ప్రదేశ్లో వాహనాలను ఉత్పత్తి చేసే సంస్థల యొక్క వాహనాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి రోడ్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్లు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇసుజు మోటార్స్కు ఆంద్ర ప్రదేశ్లో ప్రొడక్షన్ ప్లాంటు ఉండటం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఇసుజు వాహనాలను కేవలం ఎక్స్ షోరూమ్ ధరతో మాత్రమే కొనుగోలు చేయవచ్చు, మరిన్ని వివరాలకు ఇసుజు డీలర్లను సంప్రదించవచ్చు.

2017 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల:
2017 రేంజ్ రోవర్ ఎవోక్ విడుదల:
రేంజ్ రోవర్ ఇండియన్ మార్కెట్లోకి 2017 ఎవోక్ ను విడుదల చేసింది. ఎంబర్ అనే పేరుతో స్పెషల్ ఎడిషన్న కూడా విడుదల చేసింది. 2017 ఎవోక్ ప్రారంభ ధర రూ. 49.10 లక్షలుగా ఉంది.

భారత్ అగ్ని-V అణు క్షిపణి పరీక్షలు:
అగ్ని-V అణు క్షిపణిని ప్రయోగించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేసుకుంది. ఈ తరుణంలో చైనాతో పాటు భారత్ శత్రు దేశాలు భారత్ను చూసి మరింత భయపడే పరిస్థితి ఏర్పడింది.


Click it and Unblock the Notifications








