భారతీయ మార్కెట్లోకి ఫిబ్రవరి 2, న ఆరంగ్రేటం చేయనున్న జీప్ బ్రాండ్
లగ్జరీ ఎస్యువి ల బ్రాండ్ కు పేరుగా చెప్పుకునే జీప్ బ్రాండ్ భారతీయ మార్కెట్లోకి తమ ఉత్పత్తులను అందివ్వడానికి సన్నద్దం అవుతోంది. జీప్ బ్రాండ్ అధికారికంగా తమ కార్యకలాపాలను ఫిబ్రవరి 3, 2016 నుండి ప్రారంభించనుంది మరియు 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.

జీప్ బ్రాండ్ కు మంచి పేరు తీసుకువచ్చిన గ్రాండ్ చిరోకి మరియు వ్రాంగ్లర్ లను జీప్ బ్రాండ్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది. వీటితో పాటు కొన్ని ఇతర మోడళ్లను కూడా ప్రవేశ పెట్టనుంది. దీనితో పాటు ప్రముఖ లగ్జరీ ఎస్యువి సంస్థ ఫియట్ క్రిస్లర్ కూడా దీనితో పోటి పడనుంది.
ముందుగా దేశీయ మార్కెట్లోకి ఫియట్ క్రిస్లర్ సంస్థ కంప్లీట్లి బిల్ట్ యూనిట్ వాహనాలను మార్కెట్లోకి అందివ్వనుంది. ఆ తరువాత డిమాండ్ను బట్టి వీటిని దేశీయంగా అసెంబుల్ చేసి మార్కెట్లోకి అందివ్వాలని నిర్ణయించుకుంది. మరియు జీప్ బ్యాడ్జితో మరిన్ని వాహనాలను కూడా దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.

ఫిబ్రవరి ప్రారంభంలో జరిగే 2016 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించే అన్ని వాహనాల గురించి పూర్తి సమాచారం డ్రైవ్స్పార్క్ తెలుగు ఎప్పటికప్పుడు మీకు అందిస్తుంది. మరిన్ని వివరాలకు డ్రైవ్స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.


Click it and Unblock the Notifications



















