స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను విడుదల చేసిన మెర్సిడెస్ బెంజ్
గత వారంలో యూనియన్ యూరోపియన్ ఫుట్బాల్ అసోషియేషన్ (UEFA) యూరో ఛాంపియన్షిప్ గత వారంలో ఫ్రాన్స్లో ఆరభించింది. వాటికి గుర్తుగా మెర్సెడెస్ బెంజ్ ఇండియన్ మార్కెట్లోకి కొన్ని స్పెషల్ ఎడిషన్ వేరియంట్లను విడుదల చేసింది.

స్పెషల్ ఎడిషన్ వేరియంట్ల యొక్క ధరలు రూ. 25.95 లక్షలు నుండి 35.26 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్) మధ్యన ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులు పరిమిత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. జూలై 10, 2016 వరకు మాత్రమే అందుబాటులో ఉంటునట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది.
కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఉత్పత్తుల మీద స్పోర్ట్స్ ఎడిషన్ బ్యాడ్జి మరియు అన్నింటిలో కూడా స్పోర్ట్ పెడల్స్ను అందించారు. వాటి సాధారణ ఉత్పత్తులనే ఇలా అందించారు. యువత మరియు స్పోర్ట్స్ ప్రియుల కోసం వీటిని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
Also Read: ప్రపంచ వ్యాప్తంగా గరిష్ట దూరం ప్రయాణించే రైళ్లు
వీటి విడుదల వివరాలను వెల్లడిస్తూ మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణా అధికారి (సిఇవో) రోలండన్ ఫాల్గర్ మాట్లాడుతూ, " యూనియన్ యూరోపియన్ ఫుట్బాల్ అసోషియేషన్ (UEFA) యూరో 2016 ఇండియా ఉత్సవాలను పురస్కరించుకుని ఎ-క్లాస్, సిఎల్ఎ మరియు జిఎల్ఎ వంటి వాటిని స్పోర్ట్స్ ఎడిషన్" లో విడుదల చేసినట్లు తెలిపాడు.
మెర్సిడెస్ బెంజ్ స్పోర్ట్ ఎడిషన్ ధర వివరాలు:
- మెర్సిడెస్ బెంజ్ ఎ180 ధర రూ. 25.95 లక్షలు
- మెర్సిడెస్ బెంజ్ ఎ200డి ధర రూ. 26.96 లక్షలు
- మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ 200 ధర రూ. 33.24 లక్షలు
- మెర్సిడెస్ బెంజ్ సిఎల్ఎ 200డి ధర రూ. 34.25 లక్షలు
- మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ 200 ధర రూ. 34.23 లక్షలు
- మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎ 200డి ధర రూ. 35.26 లక్షలు
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications