ఎలక్ట్రానిక్ వాహనాల కొనుగోలు పై ట్యాక్స్లు నిషేధించిన మహరాష్ట్ర ప్రభుత్వం
ఢిల్లీ తరహాలో ఎక్కువగా వాహన కాలుష్యం గల రాష్ట్రం మహరాష్ట్ర, దీని కోసం మహరాష్ట్ర ఈ వాహన కాలుష్యాన్ని అదుపులో ఉంచడం కోసం ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. కాలుష్య రహిత వాహనాలను కొనుగోలు చేసే వారికి ఎటువంటి ట్యాక్స్లు కూడా ఉండవని ప్రకటన వెలువరించింది.
ఎక్కువ మంది చదివిన కథనం: 2016లో భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త కార్లు, వాటి వివరాలు
మహరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మాత్తు నిర్ణయ వెనకున్న మరిన్ని విషయాలు గురించి తెలుసుకుందాం రండి.

మహరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మాత్తు నిర్ణయం వెనకున్న రహస్యం. డీజల్ మరియు పెట్రోల్ వాహనాల కొనుగోలు ఆపడం. ఇందుకోసం కరెంటుతో నడిచే వాహనాలను కొనుగోలు దిశగా ప్రజలలో మార్పు తీసుకు రావడం.

కరెంటు వాహనాలను ఉపయోగిస్తే ఇంధన ఉద్గారాలు దాదాపుగా తగ్గిపోతాయి. ఇందుకోసం కరెంటు వాహనాలను కొనేవారు ప్రభుత్వానికి ఎటువంటి ట్యాక్స్లు కూడా చెల్లిచాల్సిన అవసరం లేదు.

ఎలక్ట్రానిక్ కార్లను కొనుగోలు చేసే వారు ఈ క్రింది ట్యాక్స్లను చెల్లించాల్సిన అవసరం లేదు.
- వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్
- రిజిస్ట్రేషన్ ట్యాక్స్
- రోడ్ ట్యాక్స్
- త్వరలో విడుదల కానున్న మహీంద్రా వెరిటో ఎలక్ట్రిక్ కారు
- ఎంతో మంది భారతీయలు ఎంపిక చేసుకున్న హోండా సిబి హార్నెట్
- భారతీయ వాహన రంగానికి ఆజ్యం పోసిన రతన్ టాటా గురించి ఆసక్తికరమైన విషయాలు
- ప్రపంచ వ్యాప్తంగా గల ఉత్తమ విమానాలు
కేవలం ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తే చాలు.

దీనికి సంభందించిన పూర్తి వివరాలు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయెల్ అతి త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ అవకాశాన్ని ఆ రాష్ట్ర ప్రజలు అందరూ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులో ఉంచిన ఏకైక సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న మహీంద్రా ఇ2ఒ టి2 ప్రీమియం వేరియంట్ ధర రూ. 4.99 లక్షలు ఎక్స్-షో రూమ్ (ముంబాయ్) గా ఉంది.

దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా తమ ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా వ్యాపార ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది.

అందులో భాగంగానే అతి త్వరలో భారతీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ సెడాన్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.



Click it and Unblock the Notifications








