ఢిల్లీ కోసం ప్రత్యేక వాహనాలను పరిచయం చేస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రా
సుప్రీం కోర్టు గత ఏడాదిలో 2000సీసీ కన్నా ఎక్కువ కెపాసిటి గల డీజల్ వాహనాల రిజిస్ట్రేన్లను ఢిల్లీ పరిధిలో జరపరాదని తీర్పు వెలబుచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహీంద్రా అండ్ మహీంద్రా వారి స్కార్పియో మరియు ఎక్స్యూవీ వాహనాల కొనుగోళ్లు ఢిల్లీ పరిధిలో పూర్తిగా నిలిచిపోయాయి. అందుకోసం మహీంద్రా అండ్ మహీంద్రా వీటిని 2000 సీసీ కన్నా తక్కువ కెపాసిటి గల ఇంజన్ ఆప్షన్లలో అందించనుంది.

మహీంద్రా అండ్ మహీంద్రా వారు ఢిల్లీ పరిధిలో అందించే స్కార్పియో మరియు ఎక్స్యూవీ500 వాహనాలలో 1.99-లీటర్ ఎమ్హాక్ డీజల్ ఇంజన్ను కల్పించనున్నారు. అయితే స్కార్పియో ఎస్యువి 120 బిహెచ్పి పవర్ మరియు ఎక్స్యూవీ500 ఎస్యువి 140 బిహెచ్పి పవర్ ను అందిస్తుంది.

అయితే 1.99సీసీ కెపాసిటి గల mHawk డీజల్ ఇంజన్ గల స్కార్పియో మరియు ఎక్స్యూవీ500 ధర లను ఇంకా విడుదల చేయలేదు. మా అంచనా ప్రకారం స్కార్పియో ధర దాదాపుగా రూ. 9.05 లక్షల నుండి 14.61 లక్షల మధ్య మరియు ఎక్స్యువి ధర దాదాపుగా 11.47 లక్షల నుండి 17.37 లక్షల మద్య ఉండవచ్చు.


Click it and Unblock the Notifications


















