హైబ్రిడ్ సిస్టమ్తో మహీంద్రా స్కార్పియో
భారత దేశపు దిగ్గజ ఎస్యువి వాహనాల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తమ స్కార్పియో ఎస్యువిలో మిల్డ్ హైబ్రిడ్ సాంకేతికతను పరిచయం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ప్రస్తుతం తమ ఎస్యువిలలో వినియోగిస్తున్న మైక్రో హైబ్రిడ్ వ్యవస్థల స్థానంలో ఈ నూతన మిల్డ్ హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని మార్పిడి చేయనున్నారు.

మహీంద్రా తాజాగా వినియోగించనున్నట్లు పేర్కొన్ని మిల్డ్ సాంకేతికను ఇంటెల్లీ-హైబ్రిడ్ ఆధారంతో రూపొందించడం జరిగింది. డ్రైవింగ్ సమయంలో ఇది స్కార్పియో ఇంజన్కు సహాయకారిగా పనిచేస్తూ మరియు స్టార్ట్-స్టాప్ సిస్టమ్ వలె కూడా పనిచేస్తుంది.
సరికొత్త ఇంటెల్లీ-హైబ్రిడ్ సిస్టమ్ మైక్రో హైబ్రిడ్ వ్యవస్థలో ఉన్నటువంటి స్టాప్-స్టార్ట్ సిస్టమ్తో పాటు బ్రేక్ ఎనర్జీని కూడా పునర్వినియోగం చేసుకుటుంది. పెద్ద పరిమాణంలో ఉన్న బ్యాటరీ మరియు ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ కలదు. ఆల్టర్నేటివ్ పద్దతిలో ఇందులో ఉన్న మోటార్ బ్యాటరీని ఛార్జింగ్ చేస్తుంది. అన్ని రకాల డ్రైవింగ్ పద్దతుల్లో కూడా బ్యాటరీకి పవర్ను అందిస్తుంది.
Also Read: నూతన శైలిలో ఉన్న సరికొత్త స్ల్పెండర్ ఐస్మార్ట్110: టెస్ట్ డ్రైవ్ రిపోర్ట్
అయితే మహీంద్రా వారి ఊహించని ట్విస్ట్ ఏమిటంటే ఈ ఇంటెల్లీ-హైబ్రిడ్ సాంకేతికను కేవలం సంస్థ యొక్క 2.2-లీటర్ వేరియంట్లో మాత్రమే అందించనుంది. ఈ ఇంజన్ 140బిహెచ్పి పవర్ మరియు 330ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read: ఈ వాహనాలు విడుదలైతే ఇక ఎస్యువి సెగ్మెంట్ పూర్తిగా మహీంద్రా ఆధీనంలోకే...!!
కేంద్ర రాజధాని పరిధిలో వీటిని కోరుకునే వారికి ఇది అందని ద్రాక్షే అని చెప్పవచ్చు. అయితే మహీంద్రా వారి 140బిహెచ్పి పవర్ మరియు 320ఎమ్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేసే 1.9-లీటర్ ఇంజన్ గలల వేరియంట్లకు ఈ పరిజ్ఞానాన్ని జోడిస్తే బాగుటుంది.


Click it and Unblock the Notifications








