అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఎస్యువిని అభివృద్ది చేయనున్న మహీంద్రా
దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇప్పుడు కాలుష్య రహిత వాహనాన్ని తయారు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. కొంత కాలం క్రితం మహీంద్రా ఇవెరిటో సెడాన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఎస్యువిని ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం మహీంద్రా వారి ఎలక్ట్రిక్ ఉత్పత్తుల్లో రెవా వాహనాలు మంచి విజయాన్ని సాధించాయి. రెవా విభాగం నుండి ఎలక్ట్రిక్ ఎస్యువిని అభివృద్ది చేయాలనే ఆలోచనలో ఉంది.
మహీంద్రా ఈ సరికొత్త ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్యువిని ఎస్107 అనే కోడ్ పేరుతో అభివృద్ది చేస్తోంది. ఈ ఎస్యువి ఎక్ట్సీరియర్ చూడటానిక అచ్చం కెయువి100 ను పోలి ఉంటుంది.
Also Read: ప్రపంచ విమానయాన రంగం గురించి 25 ఆసక్తికరమైన నిజాలు
మహీంద్రా ప్రస్తుతం వివిధ రకాల ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ సిస్టమ్లను నిర్మిస్తోంది. అదే విధంగా కమర్షియల్ వాహనాలను కూడా ఎలక్ట్రిక్ సెగ్మెంట్లో తీసుకొచ్చే యోచనలో ఉంది. తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే విధంగా ఎకో ఫ్రెండ్లీ వాహనాల తయారీ కోసం చాలా కష్టపడుతోంది.



Click it and Unblock the Notifications








