2020 నాటికి 4000 దుకాణాలు: ఇదీ మా టార్గెట్
ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమలో ఫోర్ వీలర్స్ రంగంలో తిరుగులేని విజయాన్ని సాధించింది మారుతి సుజుకి. జపనీస్ ఆధారిత మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లో విసృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తోంది. ప్రతి సెగ్మెంట్లో కూడా పోటీ పడుతూ అన్ని సంస్థలతో తలకు తలగా పోటీ పడుతోంది. అయితే ఈ సామ్రాజ్యాన్ని ఇలాగే తరతరాల వరకు నిలిచిపోయేలా చేయడానికి దేశవ్యాప్తంగా మరిన్ని దుకాణాలను తెరవాలని చూస్తోంది.

మారుతి సుజుకి తమ డీలర్షిప్లను దేశ వ్యాప్తంగా 2020 కల్లా సుమారుగా 4,000 వరకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. మారుతి సుజుకి భివిష్యత్తులో సాధించాల్సిన లక్ష్యాలని ఇప్పటికే ధృఢంగా నిర్ణయించుకుంది.అంతే కాకుండా మారుతి సుజుకి 2020 నుండి ప్రతి ఏడాది కూడా అన్ని మోడళ్ల పరంగా సుమారుగా 20 లక్షల కార్ల అమ్మకాలు చేపట్టాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. దీనిని సాధించాలంటే ఖచ్చితంగా 2020 నాటికి 4,000 డీలర్ షిప్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉండాలని తెలిపారు.
Also Read: గత ఆర్థిక సంవత్సరంలో భారీ అమ్మకాలను చవిచూసిన టాప్-10 మోడళ్లు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 127 నెక్సా షోరూమ్లు కలవు, వీటిని 250 వరకు మరియు సాధారణ షోరూమ్లు 1,820 ఉండగా వీటిని ఈ ఆర్థిక సంవత్సరంలోపు 200 వరకు పెంచాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
Also Read: గంటకు 200 కి.మీ ల వేగంతో పరుగులు పెట్టే స్పెయిన్ రైలు భారత్కు
ఈ ఏడాదిలో విడుదల కానున్న నూతన ఉత్పత్తులు లక్ష్యాన్ని సాధించడానికి ఉన్న చక్కటి మార్గం మరియు 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో ద్వారా ప్రదర్శించబడిన అన్ని ఉత్పత్తులను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కూడా తెలిపారు.


Click it and Unblock the Notifications