అమరావతిలో మొదటి మెర్సిడెస్ బెంజ్ షోరూమ్ ప్రారంభం
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఆంధ్ర ప్రదేశ్లో మొదటి సారిగా తమ మొదటి షోరూమ్ విజయవాడలో ప్రారంభించింది. సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్ వంటి వంటి సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా మహవీర్ మోటార్స్ బెంజ్ షోరూమ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

నూతన షోరూమ్ను మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇవో అయిన రోలాండ్ ఫాల్గర్ మరియు మహవీర్ మోటార్స్ గ్రూప్ ఛైర్మెన్ యశ్వంత్ జభ్బక్ సంయుక్తంగా ప్రారంభించారు. ఐదు కోట్ల రుపాయల విలువైన ఈ డీలర్ షిప్ 20,000 చదరపు అడుగులలో ఉంది.
తెలంగాణ ప్రజలకు శుభవార్త: లైసెన్స్ లేకున్నా పర్వాలేదు: పూర్తిగా చదవండి
ఈ షోరూమ్ ముందు భాగంలో ఒకే సారి నాలుగు కార్లను ప్రదర్శనకు ఉంచే విధంగా నిర్మించారు. మరియు సర్వీసింగ్ కూడా ఒకే సారి నాలుగు కార్లకు నిర్విహించే విధంగా సర్వీసింగ్ బే నిర్మించారు. ఇక్కడ నెలకు 90 కార్ల వరకు సర్వీసింగ్ సామర్థ్యం ఉన్నట్లు ఈ సందర్బంగా తెలిపారు. ప్రస్తుతం మెర్సిడెస్ బెంజ్కు దేశ వ్యాప్తంగా గల 40 నగరాలలో దాదాపుగా 83 వరకు షోరూమ్లు కలవు.



Click it and Unblock the Notifications