మరో సారి నిరూపించుకోనున్న మిత్సుబిషి మోంటెరో
జపాన్కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ మిత్సబిషి ఇండియన్ మార్కెట్లో అర కొర అమ్మకాలతో సరైన వృద్దిని సాధించలేకపోతోంది. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోకి ఎస్యువి రేంజ్కు చెందిన పజేరో స్పోర్ట్ మాత్రమే అందుబాటులో ఉంది. అయితే జపాన్ ఆధారిత సంస్థ మోంటెరో ఎస్యువిని తిరిగి రెండవ సారి దేశీయ మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మిత్సుబిషి మోంటెరో ఎస్యువి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

రెండవ సారి ఇండియన్ మార్కెట్లోకి పరిచయం కానున్న మోంటెరో ఎస్యువిని కంప్లీట్లి బిల్ట్ యూనిట్తో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ మోంటెరో ఎస్యువిని 67.28 లక్షలు ఎక్స్ షోరూమ్ ముంబాయ్గా అందుబాటులోకి తీసుకురానున్నారు.

2016 మోంటెరో ఎస్యువిలో 3.2 లీటర్ సామర్థ్యం ఉన్న టర్బో ఛార్జ్డ్ నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ను అందివ్వనున్నారు.

ఇందులో ఉన్న శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 189 బిహెచ్పి పవర్ మరియు 441 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

ఇందులోని ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు మొత్తం టార్క్ను 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ గుండా అన్ని చక్రాలకు అందుతుంది.

భద్రత పరంగా ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి కలవు.

మిత్సుబిషి మోంటెరో ఎస్యువిలో అదనపు చక్రాన్ని వెనుక డోర్ మీద అందించారు.

మిత్సుబిషి 2014 లో తక్కువ డిమాండ్ కారణంగా దేశీయంగా అమ్మకాలను నిలిపివేసింది. అయితే కొన్ని మార్పులు మరియు ఫీచర్లు అందించడం ద్వారా అమ్మకాలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

మిత్సుబిషి ఈ మోంటెరో ఎస్యువిని సెప్టెంబర్ 2016 లో విడదల చేయనున్నారు మరియు దీనికి సంభందించి బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఇండియన్ మార్కెట్లోకి ఏడు కొత్త బైకులను విడుదల చేయనున్న బజాజ్
హోండా అమేజ్ అస్సలు కొనుగోలు చేయకండి.... ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్న బాధితుడు


Click it and Unblock the Notifications








