షార్ట్సర్కూటే సైలెంట్గా కాల్చేసింది: బుగ్గిపాలైన మారుతి బాలెనొ
దీని వయస్సు 20 ఏళ్లు కాదు, రెండేళ్లు అంతకన్నా కేవలం రెండు నెలల కారు అగ్ని ప్రమాదానికి గురయ్యి బూడిదైపోయింది. కేరళలోని కొచ్చికి సమీపంలో ప్రధాన రహదారి మీద జరిగిన ప్రమాదంలో కారు మొత్తం కాలిపోయింది. అయితే అందులో ఉన్న ఇద్దరు తండ్రీ కొడుకులు క్షేమంగా బయటపడ్డారు.

క్రితం రోజున నౌషాద్ ఎ అనే వ్యక్తి తన కుమారుడిని స్కూల్లో దింపడానికి తన బాలెనొ కారులో బయలుదేరాడు. సుమారుగా ఉదయం 8:04 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
Also Read: పైలట్లు ప్రయాణికులతో షేర్ చేయకుండా దాచే విషయాలు
నౌషాద్ ప్రయాణిస్తున్న మార్గంలో వెళ్తున్న ద్విచక్రవాహనదారుడు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీరిని ఓవర్ టేక్ చేసి కారు ముందు వైపు దట్టమైన పొగలు అలుముకోవడాన్ని గ్రహించిన టూ వీలర్ రైడర్ నౌషాద్ను అప్రమత్తం చేశాడు. నౌషాద్ వెంటనే కుమారుడితో సహా క్షేమంగా బయటపడ్డాడు.
Also Read: మీ నిర్ణయాలను మార్చే కొత్త కార్ల ఆఫర్లు
డెక్కన్ క్రానికల్ అనే వైబ్సెట్ ప్రచురించి కథనం ప్రకారం, నౌషాద్ తన కుమారుడు అమల్ను ఎడపల్లి లో ఉన్న స్కూల్కు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది. నౌషాద్ మాట్లాడుతూ, కారును కొనుగోలు చేసి కేవలం రెండు నెలలు మాత్రమే అయ్యింది అని తెలిపాడు. అయితే కారులో ఏ/సి ఆన్ లో ఉంచుకుని ప్రయాణిస్తున్నట్లు కూడా తెలిపాడు.

కాసేపటకి అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేసి, ట్రాఫిక్ను పునరుద్దరించారు. అయితే ఈ ప్రమాదానికి సంభందించి అగ్నిమాపక అధికారి ఒకరు మాట్లాడుతూ, కారు ముందువైపున ఉన్న వైరింగ్ సిస్టమ్లో షార్క్ సర్క్యూట్ జరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలిపారు.


Click it and Unblock the Notifications








