భారత దేశపు హైబ్రిడ్ ఎస్యువిలకు ఊతమివ్వనున్న నిస్సాన్ ఎక్స్-ట్రయల్
ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి హైబ్రిడ్ ఎస్యువిల సెగ్మెంట్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సెగ్మెంట్లోకి నిస్సాన్ సంస్థ తమ మొదటి హైబ్రిడ్ ఎస్యువి ఎక్స్-ట్రయల్మను విడుదల చేయనుంది. జపాన్కు చెందిన నిస్సాన్ ఈ ఎస్యువిని డిసెంబర్ 2016 లో దేశీయంగా విడుదల చేయనుంది.

నిస్సాన్ మొదటి సారిగా ఈ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్యువిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. మరియు కొన్ని నెలల క్రితం దీనిని రహదారి పరీక్షల కోసం రోడ్డు మీదకు కూడా తీసుకువచ్చారు.

నిస్సాన్ ఈ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్యుని పూర్తిగా కంప్లిట్లి బిల్ట్ యునిట్గా అందుబాటులోకి తీసుకురానుంది. మరియు అత్యంత ఆకర్షణీయమైన ధరలతో సుమారుగా 30 నుండి 35 లక్షల మధ్య శ్రేణిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

జపాన్కు చెందిన నిస్సాన్ తమ ఎక్స్-ట్రయల్ యొక్క ఉత్పత్తి విడుదల కోసం ఎదురు చూస్తున్న వాటిలో ఇండియా నాలుగవ మార్కెట్గా ఉంది.

నిస్సాన్ సాంకేతికంగా ఇందులో 2.0-లీటర్ పెట్పోల్ ఇంజన్ మరియు దీనికి 32కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ను అనుసంధానం చేయనుంది.

ఇండియాకు రానున్న ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్లోని ఇంజన్కు ఎక్స్-ట్రానిక్ సివిటి గేర్బాక్స్ను అనుసంధానం చేయనున్నారు మరియు ఇంజన్ విడుదల చేసే మొత్తం పవర్ మరియు టార్క్ నాలుగు చక్రాలకు అందుతుంది.

ప్రస్తుతం విడుదలకు అన్ని కార్యక్రమాలను వడివడిగా పూర్తి చేసుకుంటున్న ఎక్స్-ట్రయల్ ఎస్యువి నిస్సాన్ నాలుగవ తరానికి చెందినది. ఇది వరకే దీనిని 2013 ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో కూడా ప్రదర్శించబడింది.

మునుపటి తరానికి చెందిన ఎస్యువితో పోల్చుకుంటే దీని క్యాబిన్ స్పేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. 5-సీటింగ్ సామర్థ్యంలో డిజైన్ చేయబడిన దీనిని సిఎన్ఎఫ్-సి ఫ్లాట్ ఫామ్ మీద అభివృద్ది చేశారు.

నిస్సాన్ ఎక్స్-ట్రయల్లో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఇండియాకు కొత్త కాదు, మొదటి ఎక్స్-ట్రయల్ 2005 లో పరిచయం చేశారు మరియు 2014 వరకు అమ్మకాల్లో ఉంది. అదే తరహా ఫీచర్లతో హైబ్రిడ్ లక్షణాలతో మన ముందుకు ఈ ఏడాది డిసెంబర్లో రానుంది. మరిన్ని ఆటోమొబైల్ కథనాల కోసం డ్రైవ్స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి. మా కథనాలపై మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

- మారుతి సుజుకి ఇగ్నిస్ ఫస్ట్ లుక్ రివ్యూ
- ఉత్తమ రీసేల్ వ్యాల్యూ కలిగిన సెకండ్ హ్యాండ్ కార్లు


Click it and Unblock the Notifications








