పెరిగిన ఇంధన ధరలు: పెట్రోల్ పై రూ. 2.58 మరియు డీజల్ పై రూ. 2.26 వరకు పెంపు
2016 జూన్ మొదటి రోజున దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ మీద రూ. 2.58 లు మరియు లీటర్ డీజల్ మీద రూ. 2.26 వరకు ధరలు పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలు 2016 మే, 31 అర్థరాత్రి నుండి అందుబాటులోకి వచ్చాయి.
Also Read: మోడీ విమాన ప్రయాణం గురించి ఎవరికి తెలియని ఆసక్తికర విషయాలు
సరిగ్గా 15 రోజుల క్రితం అంటే 2016 మే 16 ఇంధన ధరలు చివరిసారిగా సవరించబడ్డాయి. అప్పట్లో పెట్రోల్ మీద 83 పైసలు మరియు డీజల్ మీద రూ. 1.26 ల మేర పెంచారు. కేవలం అరథ మాసం కాలానికే కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఇంధన ధరలను సవరించింది.

భారత దేశపు అతి పెద్ద ఇంధన రిటైల్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఈ పెంపు గురించి స్పందిస్తూ, "అంతర్జాతీయంగా పెట్రోల్ మరియు డీజల్ ఉత్పత్తి ధరల్లో మార్పులు మరియు డాలర్తో రుపాయి విలువ మారకం రేటు తగ్గడం" పెట్రోల్ మరియు డీజల్ ఇంధన ధరల పెరగడానికి కారణం అయినట్లు తెలిపింది.
Also Read: పాత భారతీయ కార్ల గురించి మనం మిస్ అయ్యే 10 అంశాలు
ఇంధన ధరలను సవరించిన తరువాత జూన్ 1, 2016 నుండి హైదరాబాద్ నగరంలో లభించే లీటర్ పెట్రోల్ ధర రూ. 67.17 మరియు లీటర్ డీజల్ ధర రూ. 56.26 లు గా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








