ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ లెవల్ పోర్షే విడుదల ధర రూ. 97.91 లక్షలు
జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన మరియు ఖరీదైన కార్ల తయారీ సంస్థ పోర్షే ఇండియన్ మార్కెట్లోకి 2.0 లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ను విడుదల చేసింది. మకాన్ ఎంట్రీ లెవల్ ఎస్యువిగా విడుదలైనప్పటికీ దీనిని 97.71 లక్షలు ఎక్స్ షోరూమ్ (కోల్కత్త)గా విడుదల చేశారు.

పోర్షే సంస్థ 2.0 లీటర్ వేరియంట్ మకాన్ కారుకు చెందిన ఆర్డర్లను స్వీకరిస్తోంది. పండుగ సీజన్ నాటికి పోర్షే ఈ ఎస్యువిలను డెలివరీ ఇవ్వనుంది.

పోర్షే మకాన్ 2.0 లీటర్ ఎస్యువిలో 1984 సీసీ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టర్బో ఛార్జ్డ్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన సుమారుగా 248 బిహెచ్పి పవర్ మరియు 370 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

పోర్షే మకాన్ 2.0 వేరియంట్లోని ఇంజన్ను ఉత్పత్తి చేసే మొత్తం పవర్ ఎస్యువిలోని 7-స్పీడ్ పిడికె ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా నాలుగు చక్రాలకు అందుతుంది.

కొత్తగా వచ్చిన సరికొత్త 2.0 లీటర్ మకాన్ ఎస్యువి కేవలం 6.7 సెకండ్ల వ్యవధిలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

మకాన్ ఎస్యువి గరిష్టంగా 229 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

పోర్షే సంస్థ ఇందులో ప్రత్యేకమైన పరికరాలను అందించింది. అందులో పోర్షే కమ్యునికేషన్ మేనేజ్మెంట్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ,లేన్ డిపార్చర్ వార్నింగ్లను తెలిపే డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్ కలదు.

భద్రత పరంగా ఇందులో వివిధ రకాల ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం.

పోర్షే వారి ద్వారా అమ్మకాలకు సిద్దమైన మకాన్ 2.0 లీటర్ వేరియంట్ దేశీయ మార్కెట్లో ఉన్న ఆడి క్యూ 5, బిఎమ్డబ్ల్యూ ఎక్స్3 మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ వంటి ఉత్పత్తులకు పోటీగా నిలవనుంది.

మీకు ఇష్టమైన బిఎమ్డబ్ల్యూ కార్ల గురించి తెలుసుకోండి
మీకు ఇష్టమైన ఆడి కార్ల గురించి తెలుసుకోండి
మీకు ఇష్టమైన మెర్సిడెస్ బెంజ్ కార్ల గురించి తెలుసుకోండి.


Click it and Unblock the Notifications








