వేల్స్ చివరి మహారాణి వాడిన ఆ కారు ఎవరి సొంతం ?
20 వ శతాబ్దంలో అత్యంత ప్రభావవంతమైన మహిళా ప్రిన్సెస్ డయానా గారి ఆడి కారును వేలానికి వచ్చింది. వేల్స్ రాజ్యం యొక్క దివంగత రాణి డయానా, ఆడి 80 క్యాబ్రియోలెట్ కారుకు వేలం నిర్వహించనున్నారు.

వేల్స్ రాజ్యానికి రాణిగా వ్యవహరించిన డయానా గారు చార్లెస్ గారి మొదటి భార్య మరియు రెండవ ఎలిజబెత్ రాణి పెద్ద కుమార్తె. 20 వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీలి డయానా.

1977లో ప్యారిస్లో జరిగిన కారు ప్రమాదంలో డయానా మరిణంచింది. సుమారుగా తొమ్మిది సంవత్సరాల తరువాత డయానా వాడిని కారును వేలానికి సిద్దం చేశారు.

దీని ప్రేరణతోనే రూపొందించిన ఏ4 ను ఆడి దేశీయంగా మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఆడి 80 క్యాబ్రియెలెట్ కారు అత్యంత పురాతణమైన, అరుదైన మరియు ప్రముఖ ప్రిన్సెస్ డయానా వినియోగించడం కారణం చేత ఇది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆడి 80 క్యాబ్రియోలెట్ కారును ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానా గారు 1994 నుండి 1996 వరకు ఉపయోగించారు.

దీనికి సుమారుగా 50,000-60,000 పౌండ్ల ( 41.14 నుండి 49.37 లక్షల) మధ్య ధరతో వేలం నిర్వహంచనున్నారు.

సాంకేతికంగా ఆడి 80 క్యాబ్రియెలెట్లో 2.63-లీటర్ సామర్థ్యం గల ఐదు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు.

ఆడి 80 క్యాబ్రియెలెట్ లోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 131బిహెచ్పి పవర్ మరియు 186ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేయును.

ఇందులోని ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ చక్రాలకు అందడానికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గల గేర్బాక్స్ను అనుసంధానం చేశారు.

డయానా రాణి 1994 లో ఈ కారును కొనుగోలు చేసినపుడు 4,000 మైళ్లు (6,437 కిలోమీటర్లు) తిరిగింది ఆ తరువాత ఇప్పటి వరకు మొత్తం 21,412 మైళ్లు (34,460 కిలోమీటర్లు) తిరిగింది.

వేల్స్ యువరాణి వినియోగించిన ఈ కారు మొత్తం ముగ్గురు ఓనర్లను మార్చింది.

- నిర్వహణ భారం: బహుమానంగా వచ్చిన బిఎమ్డబ్ల్యూని వెనక్కిచ్చేసిన దీపా కర్మాకర్
- పాక్ను చిధ్రం చేసే భారతదేశపు 10 శక్తివంతమైన యుద్ద విమానాలు
- ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక


Click it and Unblock the Notifications








