ఇండియా కోసం మూడు ఎస్యువిలు సిద్దం చేస్తోన్న స్కోడా
ప్రముఖ కార్ల తయారీ సంస్థ Czech కు చెందిన స్కోడా ఇండియన్ మార్కెట్లోకి మూడు సరికొత్త ఎస్యువిలను విడుదల చేయాలని చూస్తోంది. ప్రస్తుతం దేశీయంగా ఉన్న ఎస్యువి సెగ్మెట్ బలపడుతున్న నేపథ్యంలో స్కోడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

స్కోడా విడుదల చేయడానికి చేస్తున్న వాటిలో 7-సీటింగ్ సామర్థ్యం ఉన్న ఎస్యువి, కొడియాక్ మరియు యెటి ఎస్యువిలను తమ పేరెంట్ కంపెనీ అయిన వోక్స్వ్యాగన్ వారి ఎమ్క్యూబి ఏఒ ఫ్లాట్ఫామ్ మీద అభివృద్ది చేయనుంది.

వోక్స్ వ్యాగన్ మరియు స్కోడా పేరెంట్ సంస్థలుగా ఉన్న సమయంలో రూపొందించిబడిన ర్యాపిడ్ మరియు వెంటో సెడాన్ల తరహాలో కాంపాక్ట్ ఎస్యువిని అభివృద్ది చేస్తున్నట్లు సమాచారం.

రెండవ ఎస్యువిగా స్కోడా సంస్థ తమ యెటి వాహనం ఆధారంతో తయారు చేయనున్నారు. అయితే ఇంత వరకు ఈ తరువాత తరానికి చెందిన స్కోడా యెటి ఎస్యువిని ఇంత వరకు ఎక్కడ కూడా ప్రదర్శించలేదు.

స్కోడా వారి మూడవ ఎస్యువి కొడియాక్ గా నిర్ధారణ అయ్యింది. స్కోడా దీనిని అక్టోబర్లో జరిగే 2016 ప్యారిస్ మోటార్ షో లో ప్రదర్శించనుంది. ఇప్పటికే దీనిని పలుమార్లు ఇండియన్ రోడ్ల మీద పరీక్షించారు కూడా.

7-సీటింగ్ సామర్థ్యంతో రానున్న ఈ కొడియాక్ ఎస్యువి ధర సుమరుగా 22 నుండి 30 లక్షల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి.

సరికొత్త కొడియాక్ ఎస్యువిలో 1.8-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజల్ ఇంజన్ను అందివ్వనున్నారు.

ఇందులో పరిచయం చేయనున్న రెండు ఇంజన్లను కూడా సూపర్బ్ సెడాన్ కారులో గుర్తించవచ్చు. ఈ రెండు ఇంజన్లకు 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గల గేర్బాక్స్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

రహస్యాల కోట ఏరియా 51 గురించి ఆసక్తికరమైన విషయాలు...!!
భారత్లో గల టాప్-10 బెస్ట్ ఎయిర్లైన్స్: మరింత చదవండి


Click it and Unblock the Notifications








