నిస్సాన్ నుండి ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్యువి
నిస్సాన్ ఇండియా గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద తమ ఎక్స్-ట్రయల్ హైబ్రిడ్ ఎస్యువిను ప్రదర్శించింది. ఈ హైబ్రిడ్ ఎస్యువి గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

డిజైన్
నిస్సాన్ వారి పాత ఎక్స్ ట్రయల్ ఎస్యువి కి మరియు ప్రస్తుతం విడుదల చేసిని ఎక్స్ ట్రయల్ హైబ్రిడ్ ఎస్యువికి మధ్య పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. అయితే హెడ్ లైట్లు, పగటి పూట వెలిగే లైట్లు మరియు ఎక్స్-ట్రయల్కు తోడుగా హైబ్రిడ్ అనే బ్యాడ్జిని జోడించారు.

ఇంజన్ వివరాలు
నిస్సాన్ వారి సరికొత్త ఎక్స్-ట్రయల్ ఎక్స్యువి లో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు.

ఎలక్ట్రిక్ ఇంజన్
ఈ హైబ్రిడ్ ఎస్యువి లో గల పెట్రోల్ ఇంజన్కు 32 కిలోవాట్ కెపాసిటి గల విద్యుత్ మోటార్ అనుసంధానమై ఉంటుంది.

పవర్
పెట్రోల్ మరియు విత్యుత్ మోటార్ రెండు కలిసి సంయుక్తంగా 142 బిహెచ్పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను విడుదల చేయును.

గేర్బాక్స్
ఎలక్ట్రిక్ మరియు పెట్రోల్ ఇంజన్ విడుదల చేసే పవర్ ను ఇందులో గల సివిటి గేర్బాక్స్ చక్రాలకు అందిస్తుంది.

ధర
నిస్సాన్ ఇండియా ఈ ఎక్స్-ట్రయల్ ఎస్యువి ధరను దాదాపుగా 30 లక్షలు వరకు నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.

పోటి
నిస్సాన్ ఇండియా తమ హైబ్రిడ్ ఎస్యువిని మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా సిఆర్-వి మరియు హ్యుందాయ్ స్యాంటా ఫి వంటి ఎస్యువిలకు పోటిగా నిలవనుంది.

అందుబాటులోకి
నిస్సాన్ ఇండియా తమ ఎక్స్ ట్రయల్ హైబ్రిడ్ ఎస్యువిని ఈ ఏడాది చివరి కల్లా మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుంది.

- మహీంద్రా నుండి సరికొత్త ఏరో కాన్సెప్ట్ ఎస్యువి
- వితారా బ్రిజా ఎస్యువిని ప్రదర్శించిన మారుతి సుజుకి
- టాటా వారి సరికొత్త నెక్సాన్ మిని ఎస్యువి


Click it and Unblock the Notifications








