Just In
- 1 hr ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 3 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 4 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- 5 hrs ago ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
Don't Miss
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి ఆ ముగ్గురు..
- Movies లవ్ సీక్రెట్స్ బయటపెట్టిన బిగ్ బాస్ బ్యూటీ దివి... ఓన్లీ మగవారి కోసమే అంటూ!
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరులో 25 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు: కేంద్ర ప్రభుత్వం
ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ కోసం బెంగళూరు నగరంలో 25 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనుంది.
ఎలక్ట్రిక్ కార్లకు ఛార్జింగ్ కోసం బెంగళూరు నగరంలో 25 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. పైలట్ ప్రాజెక్ట్ క్రింద ఈ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనుంది.
హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్ల తయారీ మరియు వినియోగాన్ని పెంచడానికి కృషిచేస్తున్న ఫేమ్(FAME) బెంగళూరు నగరంలో పైలట్ ప్రాజెక్టుగా ఎలక్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.
"ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ (హైబ్రిడ్) ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా (FAME-India) స్కీమ్ క్రింద, మహీంద్రా రెవా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో బెంగళూరులోని ఆరు ప్రదేశాల్లో 25 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు", కేంద్ర విద్యుత్, బొగ్గు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ మంత్రి పియూష్ గోయల్ లోక్ సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
Recommended Video
ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఏకైక సంస్థ మహీంద్రా రెవా ఎలక్ట్రిక్ వెహికల్స్. కేంద్ర ప్రభుత్వ చొరవతో మహీంద్రా గ్రీన్ సిటిలోని ఆరు ప్రధాన ప్రాంతాలలో ఈ 25 ఛార్జింగ్ స్టేషన్లను నిర్మిస్తోంది.
"భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధిలో 100 ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడానికి, అదే విధంగా రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇస్ట్రుమెంట్స్ లిమిటెడ్ కేంద్ర రాజధాని పరిధిలో, జైపూర్ మరియు ఛంఢీగర్లలో 200 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ముందుకువచ్చాయి." అయితే ఈ ప్రతిపాదనలను ఆమోదించినట్లు పియూష్ గోయల్ తెలిపాడు.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
కేంద్ర ప్రభుత్వం ఇదే చొరవతో, ఫేమ్ సహకారంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తే, 2030 నాటికి పెట్రోల్ మరియు డీజల్ కార్లకు బదులు ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే విక్రయించాలి అనే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.