XTRA Mileage టైర్ విడుదల చేసిన బ్రిడ్జ్స్టోన్
ప్రపంచపు దిగ్గజ టైర్లు మరియు రబ్బర్ తయారీ సంస్థ బ్రిడ్జ్స్టోన్ కార్పోరేషన్ మార్కెట్లోకి M851 XM Xtra Mileage టైరును విడుదల చేసింది.
ప్రపంచపు దిగ్గజ టైర్లు మరియు రబ్బర్ తయారీ సంస్థ బ్రిడ్జ్స్టోన్ కార్పోరేషన్ మార్కెట్లోకి M851 XM Xtra Mileage టైరును విడుదల చేసింది.
"10.00 R20 M851 XM" టైరును, ప్రత్యేకించి కమర్షియల్ వాహనాల కోసం డిజైన్ చేసినట్లు బ్రిడ్జ్స్టోన్ తెలిపింది. థాయిలాండ్ వేదికగా ఇండియన్ ఛానల్ పార్ట్నర్స్ సమక్షంలో Xtra Mileage టైరును లాంచ్ చేసింది.

ఇండియాలో దూర ప్రాంత ప్రయాణాలకు ఉపయోగించే వెహికల్స్లో వినియోగించడానికి, అత్యుత్తమ నాణ్యత విలువలతో, మైలేజ్ పెంచే విధంగా M851 XM Xtra Mileage టైరును అభివృద్ది చేసింది బ్రిడ్జ్స్టోన్.
Recommended Video


M851 XM Xtra Mileage టైరు అధిక మైలేజ్ ఇవ్వడంలోనే కాకుండా ఎక్కువ కాలం మన్నిక మరియు రోలింగ్ను అధిగమించడం వంటి అంశాల పట్ల ఇండియన్ కస్టమర్లను ఖచ్చితంగా ఆకర్షిస్తుందని విడుదల వేదిక మీద బ్రిడ్జ్స్టోన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్జ్సిక్యూటివ్ డైరక్టర్ కజుతోషి ఒయామా తెలిపాడు.


Click it and Unblock the Notifications








