గుడ్ న్యూస్: తగ్గిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు
తగ్గిన ఇంధన ధరలు,పెట్రోల్ మీద రూ. 1.12 లు మరియు డీజల్ మీద రూ. 1.24 లు తగ్గిన ధరలు.
చమురు కంపెనీలు జూన్ 15 సాయంకాలం నిర్వహించిన సమావేశంలో ఇంధన ధరలను తగ్గించినట్లు పేర్కొన్నాయి. తగ్గిన ధరలు నేటి ఉదయం నుండి అమల్లోకి వచ్చాయి. ఇంధన ధరల సవరణ సమావేశంలో లీటర్ పెట్రోల్ మీద రూ. 1.12 లు మరియు లీటర్ డీజల్ మీద రూ. 1.24 లు తగ్గించడం జరిగింది.

రోజు వారీగా చేపట్టనున్న ఇంధన ధరల సవరణ నేటి నుండి ప్రారంభం కానుంది. ప్రతి రోజు మారనున్న ఇంధన ధరలను ఆ రోజు ఉదయం ఆరు గంటల నుండి అమలు తేనున్నారు. మునుపటి రోజు ధరల ఆధారంగా తరువాత రోజు ధరల్లో మార్పులు చేయనున్నారు. గతంలో మాసానికి రెండు సార్లు, మొదటి రోజు మరియు 16 వ రోజు ధరలను సవరించే వారు.

తాజాగా జరిగిన పెట్రో ధరల సవరణ అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 65.48 లు మరియు రూ. 54.49 లు గా ఉన్నాయి.

ఇండిన్ అయిల్ కార్పోరేషన్ తెలిపిన ఓ ప్రకటనలో," రోజు వారీగా పెట్రోల్ మరియు డీజల్ ధరల్లో సవరణలు జరగనున్నాయి. ఈ విధానం జూన్ 16 నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. మునుపటి రోజు ఇంధన ధరల ఆధారంగా తరువాత రోజు ధరల్లో మార్పులు ఉండనున్నాయి. ఉదయం 6 గంటల నుండి తరువాత రోజు ఉదయం 6 గంటల వరకు వర్తించేలా ప్రతి రోజు ఇంధన ధరల్లో మార్పులు చేయనున్నట్లు" పేర్కొంది.


Click it and Unblock the Notifications








