Just In
- 19 min ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 3 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 5 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 9 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హ్యుందాయ్ క్రెటాకు పోటీని క్రియేట్ చేస్తున్న కియా మోటార్స్
కియా మోటార్స్ భాగస్వామ్యపు సంస్థ హ్యుందాయ్కు చెందిన క్రెటాకు పోటీగా 2019 మలిసగంలో కొత్త ఎస్యూవీని విడుదల చేయనుంది.
సౌత్ కొరియా అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ 2019 ప్రారంభం నాటికి ఇండియాలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. కియా మోటార్స్ భాగస్వామ్యపు సంస్థ హ్యుందాయ్కు చెందిన క్రెటాకు పోటీగా 2019 మలిసగంలో కొత్త ఎస్యూవీని విడుదల చేయనుంది.
కియా మోటార్స్ కార్పోరేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ మరియు ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, తేయ్ హ్యూన్ ఓహ్ మాట్లాడుతూ, కియా మోటార్స్ మూడు కొత్త ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు.
తొలి మూడు మోడళ్లలో మొదటిది మిడ్-సైజ్ ఎస్యూవీ అని తెలిసింది. కియా మోటార్స్ మిడ్-సైజ్ ఎస్యూవీ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీనివ్వనుంది. దీని తర్వాత ఉన్న హ్యాచ్బ్యాక్, సెడాన్ సెగ్మెంట్ల మీద దృష్టిసారించనుంది.
తక్కువ ధరతో అందుబాటులో ఉంచేందుకు మిడ్-సైజ్ ఎస్యూవీ విడి పరికరాలు సేకరణ మరియు తయారీ మొత్తం ఇండియాలోనే జరగనుంది. దీని ద్వారా పోటీగా ఉన్న ఉత్పత్తుల కంటే తక్కువ ధరతో లభిస్తాయి.
ఇండియాలో విడుదల చేయాల్సిన ఉత్పత్తుల జాబితాను కియా మోటార్స్ ఇప్పటికే ఖరారు చేసింది. ప్రస్తుతం డీలర్ల నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలలో కియా మోటార్స్ తమ ఉత్పత్తులను ప్రదర్షిస్తోంది.
వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద కియా మోటార్స్ నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరించనుంది. అంతే కాకుండా, కాంపాక్ట్ ఎస్యూవీ మరియు సెడాన్ లతో పాటు అత్యంత ఖరీదైన లగ్జరీ వాహనాలను కూడా విడుదల అవకాశాలు ఉన్నాయి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ప్రస్తుతం కియా మోటార్స్ నుండి వస్తున్న సమాచారం చూస్తే, ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ఉన్న అన్ని సెగ్మెంట్లో తమ ఉత్పత్తులను విడుదల చేసే ప్లాన్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే కనుక జరిగితే, దేశీయంగా బడా కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది.