Just In
- 13 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- 15 hrs ago మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. కొత్త బైక్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ అస్సలు మిస్ అవ్వకండి
- 17 hrs ago వారెవ్వా.. యూట్యూబర్స్ వాడే కార్లు ఇలా ఉన్నాయా!.. ఓ లుక్కేసుకోండి
- 18 hrs ago రూ. 10 లక్షల లోపు ధరలో విడుదల కాబోతున్న ప్రముఖ బ్రాండ్ల కార్లు ఇవే..
Don't Miss
- News rasi phalalu today: ఈ రాశులవారు మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి!!
- Movies Premalu 11 Days Collections: చరిత్ర సృష్టించిన ప్రేమలు.. తెలుగులో ఫస్ట్ మూవీగా సంచలన రికార్డు
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్పై వేటు!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్జున్వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
హ్యుందాయ్ క్రెటాకు పోటీని క్రియేట్ చేస్తున్న కియా మోటార్స్
కియా మోటార్స్ భాగస్వామ్యపు సంస్థ హ్యుందాయ్కు చెందిన క్రెటాకు పోటీగా 2019 మలిసగంలో కొత్త ఎస్యూవీని విడుదల చేయనుంది.
సౌత్ కొరియా అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ 2019 ప్రారంభం నాటికి ఇండియాలో అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. కియా మోటార్స్ భాగస్వామ్యపు సంస్థ హ్యుందాయ్కు చెందిన క్రెటాకు పోటీగా 2019 మలిసగంలో కొత్త ఎస్యూవీని విడుదల చేయనుంది.
కియా మోటార్స్ కార్పోరేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ మరియు ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, తేయ్ హ్యూన్ ఓహ్ మాట్లాడుతూ, కియా మోటార్స్ మూడు కొత్త ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు.
తొలి మూడు మోడళ్లలో మొదటిది మిడ్-సైజ్ ఎస్యూవీ అని తెలిసింది. కియా మోటార్స్ మిడ్-సైజ్ ఎస్యూవీ విపణిలో ఉన్న హ్యుందాయ్ క్రెటాకు గట్టి పోటీనివ్వనుంది. దీని తర్వాత ఉన్న హ్యాచ్బ్యాక్, సెడాన్ సెగ్మెంట్ల మీద దృష్టిసారించనుంది.
తక్కువ ధరతో అందుబాటులో ఉంచేందుకు మిడ్-సైజ్ ఎస్యూవీ విడి పరికరాలు సేకరణ మరియు తయారీ మొత్తం ఇండియాలోనే జరగనుంది. దీని ద్వారా పోటీగా ఉన్న ఉత్పత్తుల కంటే తక్కువ ధరతో లభిస్తాయి.
ఇండియాలో విడుదల చేయాల్సిన ఉత్పత్తుల జాబితాను కియా మోటార్స్ ఇప్పటికే ఖరారు చేసింది. ప్రస్తుతం డీలర్ల నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా జరుగుతున్న కార్యక్రమాలలో కియా మోటార్స్ తమ ఉత్పత్తులను ప్రదర్షిస్తోంది.
వచ్చే ఏడాది ఢిల్లీలో జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద కియా మోటార్స్ నాలుగు కొత్త మోడళ్లను ఆవిష్కరించనుంది. అంతే కాకుండా, కాంపాక్ట్ ఎస్యూవీ మరియు సెడాన్ లతో పాటు అత్యంత ఖరీదైన లగ్జరీ వాహనాలను కూడా విడుదల అవకాశాలు ఉన్నాయి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ప్రస్తుతం కియా మోటార్స్ నుండి వస్తున్న సమాచారం చూస్తే, ఇండియన్ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో ఉన్న అన్ని సెగ్మెంట్లో తమ ఉత్పత్తులను విడుదల చేసే ప్లాన్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే కనుక జరిగితే, దేశీయంగా బడా కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది.