తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు సిద్దమైన మారుతి సుజుకి: ఎప్పుడంటే...?

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్ల మీద పనిచేస్తున్నట్లు తెలిసింది. తమ మొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సన్నద్దం అవుతోంది.

By Anil

భారతదేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్లు గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్ల మీద పనిచేస్తున్నట్లు తెలిసింది. తమ మొదటి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి సన్నద్దం అవుతోంది.

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు

పెట్రోల్ మరియు డీజల్ కార్ల విపణిలో తిరుగులేని విజయాన్ని అందుకున్న మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి కాస్త ఆలస్యంగానే ప్రవేశించినప్పటికీ తనదైన శైలిలో ఎలక్ట్రిక్ కార్ల ప్రియులను ఆకట్టుకోనుంది.

Recommended Video

Tata Motors Delivers First Batch Of Tigor EV To EESL - DriveSpark
మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు

మారుతి సుజుకి చైర్మన్ ఆర్‌సి భార్గవ మాట్లాడుతూ, "మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేస్తుంది. సుజుకి-టయోటా భాగస్వామ్యంలో అభివృద్ది చెందుతున్న ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశాడు."

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు

2030 నాటికి ఇండియాలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే విక్రయించాలని భారత ప్రభుత్వం భావించినప్పుడు మారుతి సుజుకి తమ నిర్ణయాన్ని వెలిబుచ్చింది. కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను తప్పకుండా ప్రవేశపెడుతుంది. అయితే, ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ కార్లకు సంభందించిన సాంకేతిక పరిజ్ఞానం లేదని భార్గవ అప్పట్లోనే వెల్లడించాడు.

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు

జపాన్ దిగ్గజాలు సుజుకి-టయోటా ఉమ్మడి భాగస్వామ్యం నుండి ఎలక్ట్రిక్ కార్ల అభివృద్ది మరియు తయారీకి కావాల్సిన పరిజ్ఞానాన్ని మారుతి సుజుకి తీసుకోనుంది. మారుతి తొలి ఎలక్ట్రిక్ కారును అత్యంత సరసమైన ధరతో 2020లో ప్రవేశపెడతామని భార్గవ గారు ప్రకటించారు.

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు

ఇండియన్స్ ఎలాంటి ఎలక్ట్రిక్ కార్లను ఇష్టపడుతున్నారు, ఎలాంటి కార్లను కోరుకుంటున్నరో అనే అంశం మీద మారుతి సుజుకి దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించనుంది. ఈ రిపోర్ట్ 2018 ఫిబ్రవరి నాటికి సిద్దం చేసి, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మారుతి తొలి ఎలక్ట్రిక్ కారును అప్పటి నుండి రెండేళ్ల తరువాత లాంచ్ చేయనుంది.

Trending On DriveSpark Telugu:

2018 ఫిబ్రవరిలో భారీ సంచలనానికి తెర దించిన మారుతి

ఇది విడుదలైతే మార్కెట్ పగ్గాలు పూర్తిగా మారుతి చేతిలోకే!!

30కిమీల మైలేజ్‌తో నెక్ట్స్ జెనరేషన్ మారుతి ఆల్టో

మహీంద్రా & టాటా లకు మారుతి సుజుకి దిమ్మతిరిగే షాక్

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో మారుతి ముందున్న అతి పెద్ద సవాల్ ఛార్జింగ్ స్టేషన్లు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్టేషన్ల కొరత కస్టమర్లను వేధించనుంది. ఇందుకు ఎవరి సహాయం తీసుకోకుండా స్వయంగా తామే దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ ఛార్జింగ్ స్టేషన్లను నెలకొల్పనున్నట్లు మారుతి వెల్లడించింది.

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మహీంద్రా మాత్రమే పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. ఇ2ఒ మరియు ఇవెరిటో అనే కార్ల మహీంద్రా ఎలక్ట్రిక్ లైనప్‌లో లభ్యమవుతున్నాయి. మహీంద్రా కూడా 2020 నుండి ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి విపరీతంగా పెంచాలని చూస్తోంది.

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఇంకా వాణిజ్య అవసరాలకు అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రస్తుతం భారత ప్రభుత్వానికి 10,000 టిగోర్ ఎలక్ట్రిక్ కార్లను సరఫరా చేసే ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు

ధర మరియు ఛార్జింగ్ పరమైన మౌళిక సదుపాయాల కల్పన భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న అతి పెద్ద సమస్యలు. ఎలక్ట్రిక్ కార్లలో వినియోగించే లిథియం-అయాన్ బ్యాటరీలను దిగుమతి కంపెనీలు చేసుకుంటున్న. వీటి మీద దిగుమతి భారం అధికంగా ఉంటుంది.

మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహీంద్రా ఇ2ఒ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.57 లక్షలు. ఓ మంచి పెట్రోల్ లేదా డీజల్ హ్యాచ్‌బ్యాక్‌ను ఇదే ధరతో ఎంచుకోవచ్చు. విదేశాల నుండి బ్యాటరీలను దిగుమతి చేసుకోవడమే వీటి ధరలు ఇలా ఉండటానికి ప్రధానం కారణం.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Maruti Suzuki To Launch Its First Electric Car In India — Here’s When
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X