పెరిగిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు
దేశీయ దిగ్గజ చముర సంస్థలు ఇంధన ధరలను పెంచాయి. పెట్రోల్ మీద రూ. 1.23 లు మరియు డీజల్ మీద 89 పైసల మేర పెంపును చేపట్టాయి. నూతన ధరలు గురువారం తెల్లవారుజాము నుండి అమల్లోకి రానున్నాయి.
దేశీయ దిగ్గజ చముర సంస్థలు ఇంధన ధరలను పెంచాయి. పెట్రోల్ మీద రూ. 1.23 లు మరియు డీజల్ మీద 89 పైసల మేర పెంపును చేపట్టాయి. నూతన ధరలు గురువారం తెల్లవారుజాము నుండి అమల్లోకి రానున్నాయి.

ధరలు పెంపుతో జరిగిన సవరణ అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 66.91 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 55.94 గా ఉంది. ఈ ధరలు కేవలం చమురు సంస్థల పెంపు తరువాత నిర్ణయించబడినవి. వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల పన్నుల ఆధారంగా ఈ ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.
అంతర్జాతీయ విపణిలో పెట్రోల్ మరియు డీజల్ ధరలు పెరగడం మరియు డాలరుతో రుపాయ మారకం రేటు క్షీణించడం కారణంగానే ధరలను స్వల్పంగా పెంచాల్సి వచ్చిందని భారత దేశపు అతి పెద్ద ఫ్యూయల్ రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఓ ప్రకనటలో వెల్లడించింది.


Click it and Unblock the Notifications








