Just In
- 1 hr ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 2 hrs ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 3 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 5 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
Don't Miss
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
రోడ్డు ప్రమాద బాధితులకు పది రెట్లు పెరిగిన పరిహారం
రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే కనీసం పరిహారాన్ని అతి త్వరలో పది రెట్లు పెంచనున్నారు.
రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే కనీసం పరిహారాన్ని అతి త్వరలో పది రెట్లు పెంచనున్నారు. వయసు మరియు వారి ఆదాయానికి సంభందం లేకుండా రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే పరిహారాన్ని పది రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజాగా అందిన సమచారం మేరకు, రోడ్డు ప్రమాదం మరణించినపుడు లేదా శాశ్వత అవయవ లోపం సంభవిస్తే బాధితులకు లేదా బాధితు కుటుంబ సభ్యులకు ఈ పరిహారం మొత్తాన్ని అందజేస్తారు.
బాధితులకు చెల్లించే ఈ నష్టపరిహారాన్ని 24 సంవత్సరాల తరువాత సవరించారు. అయితే, బాధితులు అధిక పరిహారానికి అర్హులని భావిస్తే, తమ యాక్సిడెంట్ కేసులను మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ద్వారా కొనసాగించుకునే అవకాశం కల్పించింది.
ప్రభుత్వ నూతన నిభందనల మేరకు, ప్రమాదంలో మరణం సంభవిస్తే బాధితుల సంబంధీకులకు 5 లక్షల రుపాయల పరిహారాన్ని అందజేస్తారు. నిబంధనల మేరకు శాశ్విత అవయవ లోపం సంభవిస్తే రూ. 50,000 నుండి రూ. 5 లక్షల పరిహారాన్ని అందిస్తారు.
ఇక మీదట ఈ నష్ట పరిహారాన్ని ప్రతి ఏడాది 5 శాతం మేర పెంచనున్నారు. ప్రమాదంలో బాధితులు త్వరగా కోలుకునేందుకు కేంద్రం ఈ నిర్ణం తీసుకుంది. గణాంకాల ప్రకారం, రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏడాది 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మరో 5 లక్షల మంది గాయపడుతున్నారు.
ప్రస్తుతం, బాధితుల తప్పిదం లేనపుడు, ప్రమాదాల్లో మరణించిన వారికి రూ. 50,000 లు పరిహారాన్ని చెల్లిస్తున్నారు. అదే విధంగా ప్రమాదాల్లో శాశ్వత అవయవ లోపం సంభవించిన వారికి రూ. 25,000 లు చెల్లిస్తున్నారు.
అయితే, తాజాగా తీసుకున్న నిర్ణయంతో తప్పుఒప్పుల లెక్కలు అవసరం లేదు. ప్రమాదం బాధితులు ఎవరైనప్పటికీ, అందరికీ నష్టపరిహారం అందుతుంది. ఇత మీదట అన్ని కేసులు MACT సమక్షంలో సమాప్తం కానున్నాయి.
చట్టంలోని నిర్మాణాత్మక సూత్రాల ఆధారంగా MACT బాధితులకు నష్టపరిహారాన్ని నిర్ణయిస్తుంది. ఈ పరిహారం బాధితుల వయస్సు, ఆదాయం మరియు బాధితుడి మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల సంఖ్య వంటి అంశాలను లెక్కలోకి తీసుకుంటారు.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మోటార్ వాహనాల చట్టంలో ఎన్నో రకాల సవరణలు జరిగాయి. కానీ, ఇప్పటి వరకు రోడ్డు ప్రమాద బాధితులకు చెల్లించే నష్ట పరిహారం విషయంలో ఎలాంటి సవరణలు జరగలేదు. పెండింగులో ఉన్న కేసులను తగ్గించే ఉద్దేశ్యంతోనే ఈ సవరణ జరిగినట్లు తెలిసింది. అయితే, బాధితులు మరింత ఎక్కువ నష్ట పరిహారాన్ని కోరుకుంటే ఆ తరువాత చట్ట పరంగా వెళ్లాల్సి ఉంటుంది.
1.2018 హోండా అమేజ్ విడుదల: ధర రూ. 5.59 లక్షలు
2.టాటా నుండి మారుతి బాలెనోకు ఊహించని ఎదురుదెబ్బ
3.ఎలక్ట్రిక్ వాహనాలు కొంటే ప్రభుత్వం నుండి 2.5 లక్షల నజరానా
4.కిమ్ జాంగ్ ఉన్ ఎక్కడికి వెళ్లినా ఈ కారు ఖచ్చితంగా వెన్నంటే ఉంటుంది