అక్టోబరు 1 నుండి కొత్త రూల్ - కారు నడిపేటపుడు ఈ తప్పు చేస్తే జరిమానా ఖాయం..!
కారు నడుపుతున్నపుడు మీ కారు యొక్క అవుడ్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్(ORVM) క్లోజ్ చేసి ఉన్నట్లయితే చట్ట పరంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినట్లే.
భారత మోటారు వాహనాల చట్టంలో ఇప్పటికీ చాలా మందికి తెలియని రూల్స్ ఎన్నో ఉన్నాయి. భారత మోటారు వాహనాల చట్టాన్ని ఔపోసన పట్టిన కొంత మంది అధికారులు సందర్భం వచ్చినపుడు రూల్స్ బ్రేక్ చేసిన అపరాధుల మీద కొరడా ఝులిపిస్తున్నారు.

మొన్నటికి మొన్న గుర్తుతెలియని వ్యక్తులకు కారులో లిఫ్ట్ ఇచ్చినందుకు ఓ వక్తికి మోటార్ వాహనాల చట్టం ప్రకారం రూ . 1500 జరిమానా విధించి కోర్టుకు ఈడ్చారు. ఆ సంఘటన జరిగేంత వరకు ఇండియాలో ఈ రూల్ ఉందని ఎవ్వరికీ తెలియదు.

ఇప్పుడు మరో ట్రాఫిక్ రూల్ అమల్లోకి రానుంది. ప్రత్యేకించి కారు నడుపుతున్నపుడు మీ కారు యొక్క అవుడ్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్(ORVM) క్లోజ్ చేసి ఉన్నట్లయితే చట్ట పరంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినట్లే.

చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ, కారుకు ఇరువైపులా ఈ అద్దాలను ఓపెన్ చేసి, డ్రైవింగ్లో ఉన్నపుడు వెనుక నుండి వచ్చే వాహనాలను వీటిలో వీటిని గమనిస్తూ ఉండాలి. తద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చు. వెనుక నుండి వచ్చే వాహనాలను గమనించకుండా సడెన్గా లెఫ్ట్ లేదా రైట్ టర్న్ తీసుకుంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

అక్టోబరు 1, 2018 నుండి ఈ రూల్ అందుబాటులోకి వస్తుంది. ఒక వేళ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ క్లోజ్ చేసి కారును నడుపుతూ పోలీసులకు పట్టుబడితే అతిక్రమనకు గాను రూ. 300 వరకు జరిమానా విధిస్తారు.

అక్టోబరు 1, 2018 నుండి ఈ రూల్ అందుబాటులోకి వస్తుంది. ఒక వేళ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ క్లోజ్ చేసి కారును నడుపుతూ పోలీసులకు పట్టుబడితే అతిక్రమనకు రూ. 300 వరకు జరిమానా విధిస్తారు.

నగర ట్రాఫిక్ పోలీసులు తొలుత ఈ నూతన రహదారి నియమం పట్ల వాహనదారులకు పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించనున్నారు. ఆక్టోబరు నుండి ఈ నియమం అమలు కానుంది కాబట్టి, వరుసగా మూడు నెలల పాటు ఈ నియమం గురించి పలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేయనున్నారు.

అంతే కాకుండా, నూతన మొబైల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రజలు ఈ రూల్ను ఉల్లఘించే వారి ఫోటోలను తీసి మొబైల్ యాప్ ద్వారా సరాసరిగా ట్రాఫిక్ అధికారులకు పంపించవచ్చు.
ఆ ఫోటోలలో రూల్ అతిక్రమించడం మరియు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. పోలీసులను ఆ ఫోటోల ద్వారా అతిక్రమనదారులను గుర్తించి ఆన్లైన్ ద్వారా చలానా జారీ చేస్తారు.

సలహా మండలితో జరిగిన సమావేశంలో సరైన అనుమతులు లేని త్రీ-వీలర్ల మీద కూడా చర్యలు తీసుకోవాలాని చర్చించారు. అంతే కాకుండా, ఈ సమావేశంలో కాలం చెల్లిన పాత సీసీటీవీల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని మరియు రాత్రి పూట జరిగే నేరాలను అరికట్టేందుకు నైట్ విజన్ కెమెరాలను ఏర్పాటు చేయాలని భావించారు.

డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ క్లోజ్ చేసి కార్లను నడిపే వారికి జరిమానా విధించడం పట్ల చంఢీగర్ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం నిజంగా హర్షించదగినది. రియర్ వ్యూవ్ మిర్రర్లను పట్టించుకోకపోవడం తప్పించిలేని ప్రమాదాలకు దారితీస్తుంది.
ఛండీగర్ ట్రాఫిక్ పోలీసులు అమలు చేయనున్న ఈ రూల్ దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తే, మంచి ఫలితాలు సాధ్యమవుతాయి.



Click it and Unblock the Notifications








