మీ పాత కేసులను క్లోస్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులనుండి దిమ్మతిరిగే ఆఫర్
వాహన చాలకులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి దానికి జరిమానా కట్టకుండా ఉన్నవాళ్లకు పోలీసులు ఒక సువర్ణ అవకాశాన్ని ఇవ్వటానికి ముందయ్యారు. ఈ నగరంలోని ట్రాఫిక్ పోలీసులు చేసిన ఈ కొత్త స్కిం మీరు వేరే ఏ రాజ్యంలోని నగరాలలో చూడటం కుదరదు.

ప్రపంచంలోకెల్లా రోడ్డు ప్రమాదాల కారణంతో భారత దేశంలో ప్రాణాలను ఒదులుకుంటన్న వారి సంఖ్య ఎక్కువ అవుతొంది. ప్రతి ఎడది సుమారు 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదం లో తమ ప్రాణాలను వదులుకుంటున్నారు అని ఒక నివేదిక చెబుతొంది.

హెల్మెట్ లేకుండా డ్రైవ్ చెయ్యటం, మద్యం సేవించి డ్రైవ్ చెయ్యటం మరియు ఓవర్ స్పీడింగ్ వలన రోడ్డు ప్రమాదాలకు ముఖ్యమైన కారణాలని చెప్పుకోవచ్చు. దీని గురించి నగరంలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఎంత అవగాహన చేసిన, చాలకులు ఇంకా కూడా ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పాలించటంలేదు.

ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిని పట్టుకోవటానికి పోలీసులు రోడ్డు పక్కలలో కాపు కాస్తూ ఉంటారు మరియు టెక్నలాజి అప్డేట్ అవుతున్న కారణాలవల్ల సిగ్నల్లలో సిసిటివి క్యామెరాలను అలవడిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

రోడ్డు నియమాలను సరిగ్గా పాలించనివాళ్ళ వెహికల్ సంఖ్యలను రిజిస్టర్ చేసుకొని, వాళ్ళ ఇంటికి ఇ-చలం పంపిస్తున్నారు. కానీ వారు చేసిన తప్పుకు విధించిన జరిమానాన్నీ కూడా కట్టకుండా ఇంకనూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు.

ఇప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి జరిమానా కట్టకుండా తిరుగుతున్న వాహన చాలకులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన పోలీసులు పాత కేసులను క్లోస్ చేసుందుకు కొత్త తంత్ర ప్రయోగాన్ని అందించింది.

అదేమిటంటే డిస్కౌంట్ ధరలో జరిమానా కట్టడం.! అవును, కోల్కత్త నగరంలోని పోలీసులు ఈ యోజనను ప్రారంభించి, దీనితో వాహన చాలకులు ఈ మునుపే వారు చేసిన రోడ్డు నియమాలను ఉల్లంఘనకు డిస్కౌంట్ ధరలో జరిమానాన్ని కట్టి కేస్ క్లోస్ చేసుకోవచ్చు.

అందిన సమాచారం ప్రకారం కోల్కత్త నగరం లోని ట్రాఫిక్ పోలీసులు ‘ఒన్ టైమ్ ట్రాఫిక్ ఫైన్ సెటల్మేంట్ స్కిం' అనే కొత్త యోజనాన్ని ప్రారంభించారు, దీనితో తప్పితస్థులు బాకీ ఉన్న జరిమానా మొత్తాన్ని డిస్కౌంట్లో కట్టవచ్చు.

ఈ యోజన రెండు దశలో అమలు చేయబడుతుంది మరియు నవెంబర్ 15, 2018 వరకు రిజిస్టర్ అయినా ట్రాఫిక్ కేసులు డిస్కౌంట్ పొందేదుకు అర్హులుగా ఉంటారు.

ఈ యోజనయొక్క మొదటి దశ డిసెంబర్ 1,2018న ప్రారంభం చేశారు, జనవరి 14, 2019వరకు ప్రభావం లో ఉంటుంది. నేరస్థులు ఈ కాలానికి 35% చెల్లించాలి మరియు మిగిలిన 65% ఇవ్వబడుతుంది.

జనవరి 15, 2019నుండి ఫెబ్రవరి 13, 2019 వరకు ప్రాజెక్ట్ యొక్క రెండవ దశ ప్రారంభం అవుతుంది, ఈ సమయంలో, జరిమానా చెల్లింపు వాహనదారులు పాత కేసుల్లో 50 శాతం తగ్గింపు పొందుతారు.

కోల్కత్త ట్రాఫిక్ పోలీస్ మరియు కోల్కత్తా పోలీస్ అధికారిక వెబ్సైట్ మూలంగా ఆన్లైన్లో కూడా జరిమానాన్ని కట్టవచ్చును, 25 ట్రాఫిక్ గార్డులలో మరియు లాల్ బజార్లోని కోయంటర్లలో ఆఫ్లైన్ కాటవచ్చును.

కోల్కత్తా పోలీసులు ఈ సమయం నంతరం బాకీ ఉన్న జరిమానాతో వాహనాలను మరియు వాహన మాలికుల పైన కఠినమైన చట్ట ప్రకారం శిక్షలను చేబడుతాం అని చెబుతున్నారు.

మొత్తంమీద ఈ రకమైన డిస్కౌంట్ ప్రాజెక్ట్ మన రాజ్యంలో కూడా ప్రారంభం అయితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది మరియు వాహన చాలకులకు అనుకూలం అవుతుంది అని కొందరి అభిప్రాయం. దీనికి మీ అభిప్రాయాన్ని కిందనున్న కామెంట్ బాక్స్ లో పంచుకొండి.
Source: FinancialExpress


Click it and Unblock the Notifications








