Just In
- 10 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 12 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 12 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 14 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Movies ఎన్టీఆర్ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
నిస్సాన్ మరియు డాట్సన్ కార్లు ఇప్పుడు మరింత ప్రియం
నిస్సాన్ మరియు డాట్సన్ రెండు కంపెనీల కార్ల మీద ధరలు పెంచినట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది. నిస్సాన్-డాట్సన్ కార్ల మీద గరిష్టంగా రెండు శాతం మేర ధరలు పెరిగాయి.
నిస్సాన్ మరియు డాట్సన్ రెండు కంపెనీల కార్ల మీద ధరలు పెంచినట్లు నిస్సాన్ ఇండియా ప్రకటించింది. నిస్సాన్-డాట్సన్ కార్ల మీద గరిష్టంగా రెండు శాతం మేర ధరలు పెరిగాయి. ధరల పెంపు అనంతరం సవరించబడిన నూతన ధరలు ఏప్రిల్ 1, 2018 నుండి అమల్లోకి వస్తాయి.
పెట్టుబడి ఖర్చులు పెరిగినందున్న నిస్సాన్ ఇండియా లైనప్లో లభించే అన్ని కార్ల మీద ధరలు పెంచింది. తయారీ భారాన్ని సమతుల్యం చేయడానికి స్వల్ప మేర ధరల పెంపు తప్పడంలేదని నిస్సాన్ పేర్కొంది.
నిస్సాన్ ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతానికి మైక్రా హ్యాచ్బ్యాక్, సన్నీ సెడాన్ మరియు టెర్రానో కాంపాక్ట్ ఎస్యూవీ ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తోంది. అదే విధంగా నిస్సాన్ ఇండియా భాగస్వామ్యపు సంస్థ డాట్సన్ గో మరియు రెడి-గో హ్యాచ్బ్యాక్ కార్లను అదే విధంగా గో ప్లస్ కాంపాక్ట్ ఫ్యామిలీ వ్యాగన్ కారును విక్రయిస్తోంది.
చివరిసారిగా, 2018 ఏడాది ప్రారంభంలో వివిధ మోడళ్ల ఆధారంగా గరిష్టంగా 15,000 రుపాయల వరకు ధరలు పెంచింది. పెట్టుబడి వ్యయం పెరగడం మరియు ముడి సరుకుల ధరలు పెరగడం అప్పట్లో ధరలు పెంచడానికి గల కారణమని నిస్సాన్ వివరించింది.
Recommended Video
నిస్సాన్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ జెరోమ్ సైగట్ మాట్లాడుతూ, "పెట్టుబడి ఖర్చులు పెరగడంతో అన్ని మోడళ్ల మీద ధరల పెంపు చేపట్టాము. ఈ నూతన ధరలు ఏప్రిల్ 1, 2018 నుండి దేశవ్యాప్తంగా ఉన్న నిస్సాన్ మరియు డాట్సన్ షోరూమ్ల ద్వారా అమల్లోకి వస్తాయని చెప్పుకొచ్చాడు."
నిస్సాన్ మాత్రమే కాదు, టాటా మోటార్స్ మరియు ఆడి ఇండియా కూడా దేశీయంగా విక్రయించే అన్ని కార్ల మీద వివిధ మోడల్ ఆధారంగా ధరలను పెంచాయి. సవరించిన కొత్త ధరలను ఏప్రిల్ 1, 2018 నుండి అమల్లోకి వస్తాయి. దిగుమతి వ్యయం పెరగడంతో ధరలు పెంచినట్లు ఆడి ఇండియా పేర్కొంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
జపాన్ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం నిస్సాన్ ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు ధరలు పెంపు చేపట్టింది. కొద్దిమేర మాత్రమే పెంచినప్పటికీ, ఈ ధరలు పెంపు ప్రభావం కార్ల విక్రయాల మీద పడే అవకాశం ఉంది. దేశీయ దిగ్గజం టాటా కూడా ధరలు పెంచడంతో మిగతా కంపెనీలు కూడా ఇదే బాటలో ధరలు పెంచడానికి సిద్దమయ్యాయి.
1. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్
2.భారీగా ధరలు పెంచిన టాటా మోటార్స్
3.2018 ట్రయంప్ టైగర్ 800 విడుదల: ధర రూ. 11.76 లక్షలు
4. మీ బైక్ మంచి మైలేజ్ ఇవ్వాలంటే చేయాల్సినవి మరియు చేయకూడనివి
5.ఈ ఎండాకాలంలో, మీ కారు ఏ/సి ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఇలా చేయండి!!