Just In
- 4 min ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 2 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 2 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 3 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
Don't Miss
- News రామేశ్వరం కేఫ్ కేసులో ట్విస్ట్, క్లాస్ మేట్ కోసం ఏం చేశాడంటే?, బాంబర్ తో అన్ని నెలలు!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Movies Vasanthi Krishnan: భర్తతో హనీమూన్ కంటే అతడితో రొమాన్సే ముఖ్యం.. అందుకే ఇక్కడే ఉండిపోయా!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
తారా స్థాయికి చేరుకున్న పెట్రో ధరలు
దేశంలో పలు అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చివరిసారిగా 2013లో గరిష్ట స్థాయిని చేరుకున్నాయి.
దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. చివరిసారిగా 2013లో గరిష్ట స్థాయిని చేరుకున్నాయి. ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిన రోజు మారే ఇంధన ధరల కారణంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలు రోజు రోజుకీ భారీగా పెరిగిపోతున్నాయి.
కేంద్ర రాజధాని పరిధి ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రో ధర రూ. 75.32 మరియు లీటర్ డీజల్ ధరర రూ. 66.79. సెప్టెంబర్ 2013 తరువాత నమోదైన అత్యధిక ధర ఇదే. ప్రస్తుతం ధోరణి ప్రకారం రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
దేశ ఆర్థిక రాజధానికి పేరుగాంచిన ముంబాయ్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 83.16 లతో తారా స్థాయికి చేరుకుంది. ఇదే ముంబాయ్ నగరంలో చివరి సారిగా సెప్టెంబరు 2013లో నమోదైన గరిష్ట ధర రూ. 83.62 లు. ప్రస్తుతం లీటర్ డీజల్ ధర రూ. 71.12 లు.
భారతదేశపు గ్రీన్ సిటీ బెంగళూరు ఈ విపరీతమైన ధరల పెంపుకు మినహాయింపు కాలేదు. బెంగళూరులో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 76.54 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 67.94 లుగా ఉంది.
చెన్నై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.16 లు మరియు లీటర్ డీజల్ ధర రూ. 70.49 లతో తారా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అదే విధంగా కలకత్తాలో పెట్రోల్ ధర రూ. 78.01 లు మరియు డీజల్ ధర రూ. 69.33లుగా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే రీతిలో పెరిగాయి. హైదరాబాదులో నేడు(17 మే 2018) లీటర్ పెట్రోల్ ధర రూ. 79.78లుగా మరియు గత నాలుగు రోజులుగా 79 రుపాయలుగా ఉంది. అదే విధంగా లీటర్ డీజల్ ధర రూ. 72 లుగా ఉంది.
గత వారం రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్ మరియు డీజల్ ధరలను పెంచుతున్నాయి. ఈ ధరల పెంపులో విదేశీ కరెన్సీతో రుపాయి మారకం రేటు కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది.
రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అదనపు ట్యాక్స్ మినహాయిస్తే, దేశవ్యాప్తంగా ఇంధన ధరల విషయంలో ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషించడం లేదు. ప్రతి రోజు మారే ఇంధన ధరల విధానం అమల్లోకి రావడంతోనే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా పునరావృతమయ్యేవి.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
2013లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రో నగరాల్లో ఇంధన ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. పెట్రోల్తో పాటు డీజల్ ధరలు కూడా అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయి.
పెరిగిన పెట్రోల్ మరియు డీజల్ ధరలు క్రిందకు దిగివచ్చే అవకాశాలు దాదాపు తక్కువగానే ఉన్నాయి. కాబట్టి, ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడం ఎంతో ఉత్తమం.