Just In
- 29 min ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 1 hr ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 5 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 6 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News రైతు రుణమాఫీ చేస్తే పార్టీని రద్దు చేసుకుంటావా? హరీష్ కు రేవంత్ రెడ్డి ప్రతిసవాల్
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరో నిండు ప్రాణాన్ని బలిగొన్న అధికారుల నిర్లక్ష్యం - వీడియో
ఎటు చూసినా నదులను తలపించే రోడ్లు, దానికి తోడు పాట్ హోల్స్కు కొదవలేని రహదారులు ఇలా అన్నీ ముంబాయ్ నగరవాసులకు నరకం చూపెడుతున్నాయి. గత శుక్రవారం నాడు ఓ మహిళ బైకు మీద నుండి క్రింద పడి బస్సు చక్రాల క్రింది
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు దేశ ఆర్థిక రాజధాని ముంబాయ్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. విపరీతమైన కుండపోత వర్షం ముంబాయ్ ప్రజల జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. అధికారుల నిర్లక్ష్యానికి ముంబాయ్ వర్షాలు అద్దం పడుతున్నాయి.
ఎటు చూసినా నదులను తలపించే రోడ్లు, దానికి తోడు పాట్ హోల్స్కు కొదవలేని రహదారులు ఇలా అన్నీ ముంబాయ్ నగరవాసులకు నరకం చూపెడుతున్నాయి. గత శుక్రవారం నాడు ఓ మహిళ బైకు మీద నుండి క్రింద పడి బస్సు చక్రాల క్రింది నలిగిపోయి ప్రాణాలొదిలింది.
విపరీతమై వర్షానికి రోడ్డు మీద ఉన్న చిన్న చిన్న గుంతలు నీటితో నిండిపోయాయి. ఓ జంట బైకు మీద ఇంటికి వెళుతుండగా, రోడ్డు మీద కనబడకుండా నీటితో నిండిపోయిన గొయ్యి మీదుగా బైకును పోనివ్వడంతో అదుపుతప్పి వెనుక కూర్చున్న మహిళ క్రింద పడిపోయింది.
వర్షం కుండబోతగా కురుస్తుండటంతో ఆమె గొడుగుని పట్టుకుంది. దానికి తోడు ఒకవైపుకు కూర్చుంది, ఈ క్రమంలో కింద పడిన వెంటనే పక్కనే వెళుతున్న బస్సు వెనుక చక్రాల క్రింద పడిపోయింది. సుమారుగా కొద్ది దూరం మేర బస్సు చక్రాలు ఆమెను ఈడ్చుకుంటూ వెళ్లాయి.
ఈ విషాద ఘటన ముంబాయ్కి సమీపంలోని కళ్యాణ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సీసీటీవీలో రికార్డు అయిన ఈ ఘటన అద్వానంగా ఉన్న ముంబాయ్ నగర రహదారుల నిర్మాణం, నిర్వహణ మరియు అధికారులు నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.
నాలుగు లేన్ల రహదారి, అందులో రోడ్డుకు ఒకవైపున సగం భాగం నీటితో నిండిపోయింది. అందులో ఆ రోడ్డు మీద ఉన్న గుంతలన్నీ నీటితో నిండిపోయాయి. తక్కువ మరియు ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలు ఒకదానినొకటి అధిగమించడం సర్వసాధారణం. ఈ క్రమంలో టూ వీలర్ గుంతను ఎక్కిచడంతో అదుపుతప్పడం, ఆ వెంటనే వీరిని అధిగమిస్తూ బస్సు రావడంతో బైకు మీద ఉన్న మహిళ చక్రాల క్రిందకు జారిపోయింది.
శరీరం మొత్తం చక్రాల క్రింద ఉండటంతో వెనుక చక్రాలు కదలడానికి కూడా కుదరలేదు, దీంతో బస్సు ఆమె శరీరాన్ని కొద్ది దూరం మేర ఈడ్చుకెళ్లింది. ఎట్టకేలకు నిలిచిపోయిన బస్సు చివరగా ఆమె మీద నుండి ముందుకెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే చనిపోయింది.
రోడ్డు మీద భారీగా నిలిచిన నీరు, నీటి క్రింది ఉన్న చిన్న చిన్న గొయ్యిలు, మహిళ కూడా బైకు మీద ఒకవైపుకు కూర్చోవడం, దానికి తోడు రద్దీగా ఉన్న రోడ్డు మీద గొడుగుని పట్టుకుని రైడర్కు రోడ్డు కనబడకుండా చేయడం ఇలాంటి అజాగ్రత్తలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.
ఇటీవల వాతావరణ పరిస్థితులు చాలా మారిపోయాయి. ఎప్పుడుపడితే అప్పుడు వచ్చే వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. దీనికి తోడు ప్రజలు మరియు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి కోలుకోలేని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కాబట్టి, వర్షాకాలంలో వీలైనంత వరకు బైకు మీద ప్రయాణించడాన్ని మానేయండి. ఇందుకు ప్రత్యామ్నాయంగా క్యాబ్, ఆటో లేదా బస్సులను ఉపయోగించండి.
ప్రమాదం జరిగిన తీరును ఇక్కడున్న వీడియో ద్వారా చూడగలరు.మన దేశంలో ఇలాంటి రోడ్లకు కొదవలేదు. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా వ్యవహరించండి.