రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టిసిని కోరిన సీఎం జగన్

ఎలక్ట్రిక్ వాహన ప్రణాళికను ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందో, అప్పటి నుంచి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన యుగం నడుస్తోంది, దీనికి ముఖ్య కారణం వాతావరణ కాలుష్యం అని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిని అనుసరిస్తున్నాయి, ఆ దారిలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రయాణించనున్నారు. అది ఏమిటో తెలుసుకొందాం రండి..

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టిసిని కోరిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) విలీనానికి సంబంధించిన విషయంపై ఏర్పాటైన కమిటీ...ఇప్పటికే ప్రవేశ పెట్టిన సెషన్ తో ముందుకు సాగడానికి ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ కమిటీ కలిశారు, తరువాత ఈ కమిటీకి సీఎం కొన్ని సూచనలు ఇచ్చారు.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టిసిని కోరిన సీఎం జగన్

ఈ కమిటీలో నియమితులైన సభ్యులుగా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ టి. కృష్ణబాబు, ప్రస్తుత వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ వి సురేంద్రబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, కెవివి సత్యనారాయణ, సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ మాజీ డైరెక్టర్ , సుదర్శనమ్ పదమ్. ఈ కమిటీకి ఎపిఎస్ ఆర్టీసి మాజీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సి ఆంజనేయ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టిసిని కోరిన సీఎం జగన్

ఏపీఎస్ఆర్టీసీ లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని, వాటిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తయారు చేసే దిశగా అడుగులు వేయాలని, దీని ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందని, కార్మికుల పట్ల తనకున్న నిబద్ధతను గురించి చెప్తూ, ఈ కమిటీ అన్ని మార్గాలను అన్వేషించి అభివృద్ధి చేస్తామని, దీనిని అర్థం చేసుకోవాలని సిఎం కోరారు.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టిసిని కోరిన సీఎం జగన్

ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణంగా, ఉద్యోగులకు వచ్చే వేతనం తదితర వాటిపై అధ్యయనం చేయాలని, విలీనం వల్ల కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు రావాలని ఆయన కమిటీ సభ్యులకు హితవు పలికారు.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టిసిని కోరిన సీఎం జగన్

కార్పొరేషన్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ విలీనం కాకుండా, ఏపీఎస్ఆర్టీసీ యొక్క పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించడం, అది స్వీయ-ఆధారపడడం కూడా కమిటీకి ఇచ్చిన పనిలో ఒకటి ఉందని ఆయన గుర్తు చేసారు. కమిటీ అధ్యక్షుడు ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ...

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టిసిని కోరిన సీఎం జగన్

ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేయగల వ్యక్తులను గుర్తించి, ఏపీఎస్ఆర్టీసీకి సరఫరా చేసే విధంగా సర్వీసు ఇవ్వాలని సీఎం మమ్మల్ని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంకా పరిణామం చెందుతున్నప్పటికీ ఎలక్ట్రిక్ బస్సులతోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టిసిని కోరిన సీఎం జగన్

ఉచిత లేదా తక్కువ వడ్డీలేని రుణాలను మాఫీ చేయాలని, కేంద్రం ఇచ్చే అన్ని గ్రాంట్లు, ప్రోత్సాహకాలు అన్వేషించాలని కూడా జగన్ కమిటీకి చెప్పారు. తమ సమస్యలపై చర్చించేందుకు ఈ కమిటీ ఏపీఎస్ఆర్టీసీ కార్మికసంఘాలను గురువారం సమావేశపనుంది. మూడు నెలల్లోగా తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు.

రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని ఆర్టిసిని కోరిన సీఎం జగన్

కావున చివరికి మన రాష్ట్రంలో కూడా ఎలక్ట్రిక్ వాహన ప్రపంచాన్ని మొదలు పెట్టడానికి కారణమైన సీఎం జగన్ గారికి ధన్యవాదాలు చెప్పవచ్చు, ఎందుకంటే దీని వలన తెలుగు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా పర్యావరణ కాలుష్యం కూడా మారుతుంది అని చెప్పవచ్చు.

Source:Timesofindia

More from DriveSpark

Article Published On: Monday, July 1, 2019, 13:39 [IST]
English summary
The committee constituted to prepare modalities of merger of the Andhra Pradesh State Road Transport Corporation (APSRTC) met chief minister YS Jaganmohan Reddy..Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+