Just In
- 10 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 11 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 12 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 13 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
19 లక్షల నిస్సాన్ కారును కేవలం రూ.2 లక్షలకే కొట్టేసిన ఘనుడు.....!
కేవలం 2 లక్షల రూపాయలకే నిస్సాన్ కిక్స్ కొన్నాడు, అలా అనుకొంటే మీరు పప్పులో కాలు వేసినట్టే ఎందుకంటే ఒక అతను డౌన్ పేమెంట్ చెల్లించి పూజ చేయిస్తానని చెప్పి మరీ యజమానిని నమ్మించి కార్ తీసుకుపోయాడు.
బెంగళూరులో నిస్సాన్ షోరూమ్ లో జరిగిన యధార్థ సంఘటన, రూ.18.6 లక్షల విలువ గల కారును కేవలం రూ. 2 లక్షల రూపాయలకు ఇచ్చి తీసుకుపోయాడు ఒక ప్రబుద్దుడు, వివరాలలోకి వెళితే..
జోస్ థామస్ అకా జోసెఫ్ అనే కస్టమర్ నిస్సాన్ కిక్స్ వాహనం కోసం షో రూంకి వెళ్ళాడు, అక్కడ నిస్సాన్ కిక్స్ కార్ వివరాలను తెలుసుకొన్నాడు,
ఆ కార్ ధర రూ 18.6 లక్షలు అని చెప్పగానే రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ కట్టిన తరువాత పూజ చేయించుకుంటానని చెప్పి కారును తీసుకెళ్లాడు.ఇక అంతే అక్కడ నుంచి కనిపించకుండా పోయాడు.
ఎన్ని సార్లు ఫోన్లు చేసినా సమాధానం లేదు.నిందితుని ఆఫీసుకు వెళ్లి అరా తీసిన ఫలితం దక్కలేదు,చివరికి పోలీసులను ఆశ్రయించిన తరువాత తెలిసిన విషయం ఏమిటంటే ఈ ఘటన జరిగి నాలుగు నెలలైంది.
ఈ సంఘటన జనవరి 23న బెంగళూరు నగరంలోని దొడ్డనెకుంది వద్ద ఉన్న సూర్య నిస్సాన్ షోంరూంలో జరిగింది. అయినప్పటికీ, షోరూమ్ మేనేజర్ HAL పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులకు ఫిర్యాదు చేశారు,
Most Read: ట్యూబ్లెస్ టైర్ల కథ ముగిసింది వాటి స్థానంలో ఎయిర్ లెస్ టైర్ల వచ్చేస్తున్నాయ్ !
దాదాపు నాలుగు నెలల తరువాత(మే 21న) షోరూం యజమాని గణేశ్ కుమార్ శెట్టి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదు గురువారం మహాదేవురాపు పోలీసు స్టేషన్కు బదిలీ అయింది.
Most Read: 150సిసి ద్విచక్ర వాహనాలను నిషేధించనున్న భారత ప్రభుత్వం...!
మేనేజర్ గణేష్ కుమార్ శెట్టి మాట్లాడుతూ, జనవరి 23 న ఉదయం 6:30 గంటలకు నిస్సాన్ కిక్స్ వాహనం గురించి అడిగిన షోరూమ్ కి జోస్ థామస్ అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి వచ్చారని తెలిపాడు, తరువాత ఇలా జరిగింది అని చెప్పాడు.
Most Read: జగనన్నపై ఎల్లలుదాటిన అభిమానం....చట్ట ఉల్లంఘనపై వివాదం ...!
ఇంత ఆలస్యంగా ఎందుకు ఫిర్యాదు చేశారని అడిగితే దానిపై గణేష్ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. గణేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకునిన తరువాత డిసిపి అబ్దుల్ అహద్ దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.
ఈ ఘటన జరిగిన నాలుగు నెలల తర్వాత ఫిర్యాదు చేసినందున కేసు దర్యాప్తునకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని,నిందితుడు ఇచ్చిన ఫోన్ నెంబర్, ఆఫీస్ అడ్రస్ వివరాలను సేకరించామని డిసిపి తెలిపారు.
Source: Thenewsminute