వాహనాల రిజిస్టేషన్ ఛార్జ్ లపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

కేంద్ర ప్రభుత్వం చేసిన పాత నోట్ల రద్దు అలాగే జిఎస్టి వంటి నిర్ణయాలతో ప్రజలపై ఎంతటి భారం పడిందో అందరికి తెలుసు. ఈ నిర్ణయంతో ప్రజలు పడిన కష్టాలు అంత ఇంతా కాదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరో బాంబ్ పేల్చనుంది అది ఏమిటో వివరంగా తెలుసుకోండి..

వాహనాల రిజిస్టేషన్ ఛార్జ్ లపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ఆధారిత రెండు, నాలుగు చక్రాల వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని భారత ప్రభుత్వం చూస్తోంది. రిజిస్ట్రేషన్, రెన్యువల్ కు సంబంధించిన చార్జీలను త్వరలో 25 రెట్ల వరకు పెంచనున్నారు.

వాహనాల రిజిస్టేషన్ ఛార్జ్ లపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, ఒకసారి కొత్త రిజిస్ట్రేషన్ల చార్జీలు అమలు చేస్తే, పెట్రోల్ లేదా డీజిల్ కారు నమోదు చేస్తే వారికీ రూ.5000, రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసే వారికీ రూ.10,000 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఈ రెండు చార్జీలు ఒక్కొక్కటి కేవలం రూ.600 మాత్రమే ఉన్నాయి.

వాహనాల రిజిస్టేషన్ ఛార్జ్ లపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచే దిశగా కేంధ్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. దీని వలన పెట్రోల్ లేదా డీజిల్ ఆధారిత వాహనాల కొనుగోలును తగ్గించవచ్చని కేంద్రం యొక్క ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

వాహనాల రిజిస్టేషన్ ఛార్జ్ లపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

రిజిస్ట్రేషన్ చార్జీలను పెంపునకు సవరణ బిల్లు ప్రస్తుతం ఇంకా ఆమోదించే దశలోనే ఉంది, ఇది కొంత కాలం తరువాత అమలు కానుంది. మరి కేంద్రం ఈ సవరణా బిల్లు ను ఎప్పుడు తీసుకొస్తుందో చూడాలి.

వాహనాల రిజిస్టేషన్ ఛార్జ్ లపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు

ఈ ప్రతిపాదన ప్రకారం ప్రైవేటు కార్లు, క్యాబ్ లు, అన్ని ద్విచక్ర వాహనాలతో పాటు వివిధ రకాల ఇంధనంపై నడుస్తున్న అన్ని ద్విచక్రవాహనాలు తమ రిజిస్ట్రేషన్ చార్జీల్లో పెరుగుదలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాహనాల రిజిస్టేషన్ ఛార్జ్ లపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

ఈ ప్రతిపాదన ప్రకారం ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ ను రూ.1000 కు పెంచాల్సి ఉండగా దానిని తిరిగి రూ.2000 వరకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ చార్జీలు రూ.50 వద్ద ఉన్నాయి.

వాహనాల రిజిస్టేషన్ ఛార్జ్ లపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

అదేవిధంగా ప్రస్తుతం రూ.1000 ఉన్న క్యాబ్ ల రిజిస్ట్రేషన్ ను రూ. 10,000 కు, రీ-రిజిస్ట్రేషన్ కు రూ.20,000 చొప్పున పెంచనున్నారు. అంటే అన్నీ కూడా, ఇంపోర్టెడ్ వాహనాలు సైతం ప్రస్తుత రూ.5,000 నుంచి రూ.40,000 వరకు రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెరుగుదలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వాహనాల రిజిస్టేషన్ ఛార్జ్ లపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

కమర్షియల్ ఎల్ఎంవిలు రిజిస్ట్రేషన్లకు రూ.1000 నుంచి రూ.10,000 వరకు మరియు రెన్యువల్ కొరకు రూ.20,000 వరకు పెరుగుదల ఉంటుంది. ఒక అధికారి ఈవిధంగా పేర్కొన్నారు, "తదుపరి 40-45 రోజుల్లో తుది ఛార్జ్ లు పెంచే నిర్ణయాన్ని ముందు మేము అందరి నుండి ఫీడ్ బ్యాక్ ను కోరుతున్నాం."

వాహనాల రిజిస్టేషన్ ఛార్జ్ లపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

పెట్రోల్ లేదా డీజల్ ఆధారిత వాహనాల రిజిస్ట్రేషన్ మొత్తాలను పెంచటం కాకుండా, 15-సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్న అన్ని వాహనాలను నిర్వీయం చేసే ప్రతిపాదనను కూడా భారత ప్రభుత్వం చూస్తోంది.

వాహనాల రిజిస్టేషన్ ఛార్జ్ లపై సంచలన నిర్ణయం తీసుకున్న కేంద్రం

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం గట్టిగా పావులు కదుపుతోంది. భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం కూడా సాధ్యమైన ప్రతి చర్యను తీసుకుంటోంది. వాస్తవంగా ఈ ప్రతిపాదన అమలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జ్ లు పెంచడం పై ప్రజలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, July 29, 2019, 10:37 [IST]
English summary
Registration Charges For Both Two And Four Wheelers To Increase By 25 Times — Here’s Why!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+