వాహన రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచనున్న ప్రభుత్వం...ఎంతో తెలుసా?

ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రవేశపెట్టే ప్రణాళికతో ముందుకు సాగుతోంది, అంతేకాకుండ ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సహించేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తోంది, అంతేకాకుండా వీటిపై రాయితీల ప్రణాళికలను తీసుకొస్తోంది. ఇంతకీ వాహన రిజిస్ట్రేషన్ చార్జీలు ఎందుకు పెంచిందో చూద్దాం రండి...

వాహన రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచనున్న ప్రభుత్వం...ఎంతో తెలుసా?

పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన శక్తితో నడిచే వాహనాల వాడకం వలన ఎంత కాలుష్యం మన దేశంలో ఉందొ మనకు తెలుసు, దీని వలన ఎన్నో ఇబ్బందులో ఇప్పటికే ఎదురుకొంటున్నాము. ఈ కాలుష్యాన్ని తాగించడానికి ప్రభుత్వం శాయశక్తులా కసరత్తులు చేస్తోంది. ఇదే విషయంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాల్లో ఈ కొత్త ప్లాన్ కూడా ఒకటి.

వాహన రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచనున్న ప్రభుత్వం...ఎంతో తెలుసా?

గత కొద్ది వారాలుగా ప్రభుత్వం పలు వ్యూహాలు రచిస్తోంది, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆటోమోటివ్ పరిశ్రమతో సంబంధం ఉన్న చాలా మంది ఈ ప్రణాళికలను తీవ్రంగా వ్యతిరేకించారు ఎందుకంటే ఇది పరిశ్రమ యొక్క వ్యవస్థకు కోలుకోలేని నష్టాన్ని కలిగించవచ్చు.

వాహన రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచనున్న ప్రభుత్వం...ఎంతో తెలుసా?

ప్రభుత్వం తన ప్రణాళికల గురించి గట్టి నిర్ణయాలను కలిగి ఉంది, కేవలం 14 రోజుల వ్యవధిలోనే ఎలక్ట్రిక్ భవిష్యత్ దిశగా వెళ్లే ప్రణాలికలతో రావాలని తయారీదారులను కొద్దీ రోజుల క్రితం కోరింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఏప్రిల్ 2023 నుంచి దేశంలో విక్రయించిన అన్ని త్రీ వీలర్లు

వాహన రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచనున్న ప్రభుత్వం...ఎంతో తెలుసా?

150సిసి కంటే దిగువన ఉన్న అన్ని ద్విచక్రవాహనాలను ఏప్రిల్ 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలతో మరియు 2030 తరువాత విక్రయించిన అన్ని వాహనాలను విద్యుతికరణ చెంది ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పుడు పాత వాహనాల వాడకాన్ని తాగించడానికి ప్రభుత్వం పెద్ద ప్రణాళికలు రచిస్తోంది.

వాహన రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచనున్న ప్రభుత్వం...ఎంతో తెలుసా?

15 ఏళ్లకు పైబడిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం చార్జీలను పెంచాలని ప్రతిపాదించింది. ప్యాసింజర్ కార్లకు రెన్యువల్ ఫీజును ప్రస్తుతమున్న రూ 1,000 నుంచి గరిష్టంగా రూ 10,000 కు పెంచనుంది. ట్యాక్సీల కోసం, రెన్యువల్ ఫీజును ప్రస్తుతమున్న రూ 1,000 నుంచి సుమారుగా రూ 15,000 కు పెంచాలని మంత్రిత్వ శాఖ కోరింది.

వాహన రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచనున్న ప్రభుత్వం...ఎంతో తెలుసా?

ట్రక్కుల కొరకు రెన్యువల్ ఫీజును రూ. 40,000 కు పెంచవచ్చు, ప్రస్తుతం ఉన్న రూ. 2,000. ప్రస్తుతం ఉన్న మోటారు వాహన నిబంధనల ప్రకారం 15 ఏళ్లు ముగిసిన వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది.

వాహన రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచనున్న ప్రభుత్వం...ఎంతో తెలుసా?

ఆ తర్వాత ఐదేళ్లపాటు దీనిని కొనసాగించాల్సి ఉంటుంది.నిబంధనలుగా విధించబడిన కొత్త ప్రణాళిక ఈ ప్రక్రియను అత్యంత వ్యయభరితం చేస్తుంది మరియు ప్రజలు వారి పాత వాహనాలను ఉపయోగించకుండా చేసింది. కేవలం పాత వాహనాలకు మాత్రమే కాదు, కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

వాహన రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచనున్న ప్రభుత్వం...ఎంతో తెలుసా?

ప్యాసింజర్ కార్లకు రిజిస్ట్రేషన్ ఫీజును 400 శాతం అంటే రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా ట్రక్కులకు 1,200 శాతానికి పైగా అంటే రూ 1,500 నుంచి రూ 20,000 వరకు పెంచవచ్చు. ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ఇది వర్తిస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టంగా తెలియదు.

వాహన రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచనున్న ప్రభుత్వం...ఎంతో తెలుసా?

అదనంగా ప్రస్తుతం ఉన్న ఐదేళ్లకు బదులు ప్రతి ఆరునెలలకు ఒకసారి పాత వాహనాలకు ఫిట్ నెస్ టెస్ట్ చేయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం కూడా ఇటువంటి వాహనాల కోసం రహదారి పన్నులు కూడా పెంచాలనే ప్రణాళికలను చేస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 27, 2019, 12:53 [IST]
English summary
Vehicle registration and re-registration charges may go up by over 400 percent if the government goes through with its plan of introducing a new rule..Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+