బిఎస్-6 డీజిల్ ఇంజిన్లను అభివృద్ధి చేయనున్న హ్యుందాయ్.
కొరియన్ ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ కూడా బిఎస్-6 ఇంజిన్ తయారీ విభాగంలోకి అడుగుపెట్టింది. దీని కోసం తగిన ప్రణాళికలను రచిస్తోంది. ఇప్పటికే తన ఉత్పత్తులలో రెండిటికి బిఎస్-6 ప్రామాణిక ఇంజిన్ను అప్గ్రేడ్ చేయనున్నట్టు వెల్లడించింది.

హ్యుందాయ్ మోటార్స్ వాటి ఉత్పత్తులలో ఉన్న గ్రాండ్ ఐ10, మరియు ఎక్స్సెంట్ లకు, బిఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తన 1.2 మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ ను అప్ గ్రేడ్ చేస్తుందని నిర్ధారించారు.

హ్యుందాయ్ ఇండియా తమ మాతృ సంస్థకు ధన్యవాదాలు తెలుపుతూ, తన డీజిల్ ఇంజిన్లను యూరో 6కు అప్ గ్రేడ్ చేయడంలో ఇప్పటికే భారీ మొత్తాలను పెట్టుబడిగా పెట్టింది అని తెలిపింది.

హ్యుందాయ్ నుండి యూ2 డీజల్ ఇంజన్ లపై బిఎస్-6 అప్గ్రేడ్ చేయడానికి అభివృద్ది పనులు మరియు వాటిపై వచ్చే ఖర్చులకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

మారుతి ఇతర డీజిల్ కార్లను నిలిపివేయడం వలన, మార్కెట్ లో ఉన్న లోటును పూరించడానికి మేము సంవత్సరానికి సుమారు 3,00000 కార్లను అభివృద్ధి చేయడానికి ఒక అవకాశాన్ని కలిగి ఉన్నాము.

ఏప్రిల్ 1, 2020 తర్వాత మా సంస్థ నుండి మొత్తం 15 డీజల్ కార్లు విడుదలకు ప్రణాలికను చేసింది, హ్యుందాయ్ ఇప్పటికే మారుతీ సుజుకీ డిజైర్ చాలా కాలం పాటు ఆక్రమించిన ఆక్రమించిన స్థానాన్ని పూరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకొంది.

మారుతి సుజుకి డిజైర్ యొక్క డీజల్ వేరియంట్ సంవత్సరానికి సుమారుగా 1.2 లక్షల యూనిట్లు ఉండగా, హ్యుందాయ్ తన అమ్మకాలను ఎక్స్సెంట్తో పోటీ ఇవ్వాలని అనుకొంటోంది.

హ్యుందాయ్ తన తరువాతి తరం గ్రాండ్ ఐ10 తో స్విఫ్ట్ మరియు ఇగ్నీస్ డీజల్ వేరియంట్ల పై పోటీని తీసుకురావాలని ప్లాన్ చేసింది. గ్రాండ్ ఐ10 1.2-లీటర్ బిఎస్-6 డీజిల్ మోటార్ ద్వారా పవర్ అందించబడుతుంది.

డీజిల్ వేరియంట్ ల ధరలు సుమారు రూ. 40,000 అధికంగా ఉంటాయని హ్యుందాయ్ చెప్పింది. మారుతీ సుజుకీ వెల్లడి చేసిన రూ .2 లక్షల అంచనాతో పోలిస్తే ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది.

డీజిల్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇప్పటికీ మార్కెట్లో అధిక వాటాను కలిగి ఉన్నాయి, హ్యుందాయ్ ఈ సెగ్మెంట్లో ముందుకు వెళ్లాలని కోరుకుంటోంది. 1.2-లీటర్ యూ2 మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ ఇండియాలో మిగిలి ఉంది.


Click it and Unblock the Notifications








