15,000 కు దాటినా హ్యుందాయ్ వెన్యూ బుకింగ్స్...దగ్గరలోనే డెలివరిలు కూడా!
హ్యుందాయ్ మే 21 న భారతీయ మార్కెట్ లో వెన్యూ ఎస్యూవి ని ప్రారంభించింది.సబ్ ఫోర్ మీటర్ల ఎస్యూవి రూ. 6.50 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరతో ప్రారంభమవుతుంది.ఇప్పుడు దీని బుకింగ్స్ ఊహకి అందని విధంగా జరిగాయి.

ఈ బుకింగ్స్ ఏప్రిల్ చివరిలో రూ. 21,000 ధరతో ప్రారంభమయ్యాయి.ఇప్పుడు, హ్యుందాయ్ ప్రారంభించిన నాటి నుండి ఒక నెలలోనే 15,000 బుకింగ్లను సంపాదించిందని ప్రకటించింది.

ఇప్పటికే ఉన్న 15,000 యూనిట్లలో, 2000 యూనిట్లు మొదటి రోజున బుక్ అయ్యాయి. అంతేకాకుండా, మార్కెట్లో వెన్యూ ఎస్యూవి డిమాండ్ తమ అంచనాలను అధిగమించిందని కూడా హుండాయ్ ప్రకటించింది.

హ్యుందాయ్ బుకింగ్ లు కాకుండా 50,000 ఎంక్వరిలు జరిగాయని చెప్పింది.హ్యుందాయ్ వెన్యూ యొక్క డెలివరీలు ఇంకా ప్రారంభం కాలేదు,ఈ వేచి చూస్తున్న కాలం కూడా ఈ కార్ పై డిమాండ్ ను పెంచుతుంది.

హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్యూవి విభాగంలో ప్రవేశించినది. ఇది భారత మార్కెట్లో బ్రాండ్ నుండి మొదటి సుబ ఫోర్ మీటర్ ఎస్యూవిగా అందిస్తోంది,ఇది రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ వేరియంట్ తో వస్తుంది.

పెట్రోల్ ఇంజిన్ ఎంపికల్లో 83 బిహెచ్పి 1.2 లీటర్, 120 బిహెచ్పి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ తో ఉన్నాయి. 1.2 లీటర్ పెట్రోల్ ఐదు స్పీడ్ మాన్యువల్కు ప్రమాణంగా ఉంటుంది.

మరోవైపు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఆరు-స్పీడ్ మాన్యువల్ లేదా ఏడు-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కు అనుగుణంగా వస్తుంది. డీజిల్ ఇంజిన్ కు,హ్యుందాయ్ క్రీటా నుంచి 1.4 లీటర్ యూనిట్ను తీసుకొన్నారు.

ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్కు జతగా వస్తుంది. హ్యుందాయ్ వెన్యూ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది,వీటిలో అన్ని లక్షణాలు మరియు భద్రతా పరికరాలను కలిగి ఉంటుంది.

ఈ బ్రాండ్లో బ్లూ లింక్ కనెక్టివిటీ ఫీచర్లు సాంకేతికతలో 33 అదనపు ఫీచర్లను అందిస్తుంది, వీటిలో 10 భారతదేశం కోసం ప్రత్యేకంగా చేర్చబడ్డాయి.

హుండాయ్ వెన్యూ దేశంలో కొరియన్ బ్రాండ్ నుండి చాలా ఆకర్షణీయమైన ఎస్యూవిగా చెప్పవచ్చు.హ్యుందాయ్ క్రెటా యొక్క విజయాన్ని ప్రతిబింబించేలా వెన్యూ ఉంటుందని ఆశిస్తున్నాము.


Click it and Unblock the Notifications








