భారతదేశంలో ప్రారంభించిన జీప్ కంపాస్ 'స్పోర్ట్ ప్లస్' వేరియంట్ ధర ఎంతో తెలుసా?
భారతదేశంలో ప్రజాదరణ పొందిన జీప్ కంపాస్ ఎస్యూవి 'స్పోర్ట్ ప్లస్' అనే కొత్త వేరియంట్ను విడుదల చేసింది.ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ప్రకారం కొత్త జీప్ కంపాస్ స్పోర్ట్ ప్లస్ ధర రూ. 15.99 లక్షలు గా ఉంది.

కొత్త స్పోర్ట్ ప్లస్ ట్రిమ్ బేస్ 'స్పోర్ట్' మరియు మిడిల్-స్పెక్ 'లాంగిట్యూడ్' మధ్య భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క కంపాస్ శ్రేణిలో వేర్వేరుగా ఉంటుంన్నాయి.జీప్ కంపాస్ స్పోర్ట్ ప్లస్ బేస్ ట్రిమ్ మీద అదనపు పరికరాలతో తాయారు చేయడం జరిగింది.

ఇందులో 16 అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, నల్ల పైకప్పు పట్టాలు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి.

ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్ మరియు డ్యాంపింగ్ను వంటి ఇతర ప్రామాణిక లక్షణాలతో దీనిని తాయారు చేసారు.ఉన్నతమైన రోడ్డు గతిశీలతతో వారు అందించే సహజ సౌలభ్యం మరియు లగ్జరీకిగా కూడా ఉన్నదీ.

భారతదేశం అధ్యక్షుడు మరియు ఎండి,ఎఫ్సిఎ, కెవిన్ ఫ్లిన్ మాట్లాడుతూ ఈ జీప్ అన్ని గణనీయ అంశాలని కలిగి ఉంది.కొత్త లక్షణంతో అదనంగా దినిని తయారుచేసాము కాబట్టి జీప్ కస్టమర్లు ఎల్లప్పుడూ మిగిలిన కారు పైన వారి కోరికను వుంచలేరు, అని అన్నారు.

జీప్ కంపాస్ స్పోర్ట్ ప్లస్ ఇతర రకాల్లో కనిపించే అదే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల ద్వారా నడుస్తుంది. ఇందులో 173బిహెచ్పి మరియు 350ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేసే 2.0 లీటర్ మల్టీజెెట్ డీజిల్ ఇంజిన్ మరియు ఒక 1.4 లీటర్ మల్టీఏయిర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 162బిహెచ్పిగా మరియు 250ఎన్ఎం టార్క్లను కలిగి ఉంది.

రెండు ఇంజన్లుకు ఆరు స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్కు ప్రమాణంగా ఉన్నాయి. డీజిల్ ఇంజిన్ 17.1కి.మీ /లి ఇంధన సామర్ధ్యపు గణాంకాలను మరియు, పెట్రోల్ ఇంజిన్ 14.1కి.మీ /లి ని సామర్థ్యాన్ని కలిగి ఉంది.

జీప్ కంపాస్ స్పోర్ట్ ప్లస్ వేరియంట్ పై డ్రైవ్స్ స్పార్క్ అభిప్రాయం
మార్కెట్లో ఎస్.వి.వి విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన భారతదేశ బ్రాండ్ లలో ఉత్తమంగా అమ్ముడైన ఉత్పత్తులలో ఏది ఒకటి. జీప్ త్వరలో ఒక ట్రయిల్హాక్ వేరియంట్ ను పరిచయం చేయబోతోంది, ఇది ఇప్పటికే మార్కెట్లో ఊహించని క్రేజ్ ను సంపాదించింది.మార్కెట్లో దీనికి మహీంద్రా ఎక్స్యూవీ500, టాటా హారియర్ మరియు నిస్సాన్ కిక్స్ లకు పోటీగా ఉంది.


Click it and Unblock the Notifications








