భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కు వినూత్నంగా వీడ్కోలు శుభాకాంక్షలు చెప్పిన జీప్ ఇండియా!
ఇటీవలే ప్రముఖ 37 ఏళ్ల భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ క్రికెటర్ పై అనేక వేలమంది అభిమానులు తమ శుభాకాంక్షలు తెలిపారు, ఇతని పై మన దేశంలో ఎంత క్రేజ్ ఉందొ మనకు తెలుసు.

జీప్ కంపెనీ విడుదల చేసిన ఒక ఇమేజ్ ప్రకారంగా, ఆల్ రౌండర్. వన్ అండ్ ఓన్లీ ఎస్ 'యువి', అనే కొటేషన్ తో శుభాకాంక్షలు తెలిపింది.

భారత క్రికెటర్లలో యువరాజ్ సింగ్ అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్, మంచి క్యాచింగ్ టెక్నిక్స్, డీసెంట్ ఫీల్డింగ్ పరాక్రమాన్ని అందించే ఆల్ రౌండర్ గా ఉన్నాడని ప్రతిఒక్కరికి తెలుసు.

భారత క్రికెటర్ కు వీడ్కోలు చెప్పడం ప్రారంభించిన జీప్ ఇండియా తన లైనప్ లో అతిపెద్ద సెల్లింగ్ ప్రొడక్ట్ అయిన తన కంపాస్ స్మాల్ ఎస్యువి ఇలాంటి లక్షణాలను కలిగి ఉందని తెలిపింది.

ఈ సంస్థ ప్రకారం, జీప్ కంపాస్ ఒక అద్భుతమైన స్టైలింగ్, ఫీచర్ లాడెన్ ఇంటీరియర్ మరియు శక్తివంతమైన, సమర్థవంతమైన ఇంజన్ ను కలిగి ఉంది.దీనిని ఎక్స్ క్లూజివ్ గా కొత్త ఫీచర్లు, కొత్త వర్షన్ గా జీప్ కంపాస్ ట్రయిల్ హౌక్ లాంచ్ చేయనుంది.

అంతర్జాతీయంగా యువరాజ్ సింగ్ 40 టెస్ట్ మ్యాచ్ లు, 304 వన్ డే అంతర్జాతీయ మ్యాచ్ లు, 2000 నుంచి 2017 వరకు 58 టీ20 మ్యాచ్ ల్లో పాల్గొన్నాడు. ఐసిసి నాకౌట్ మ్యాచ్ 2000 లో కెన్యాలోని నైరోబీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఈ క్రికెటర్ తన అరంగేట్రం చేశాడు.

ప్రముఖ భారత క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడు, మొత్తం 8,609 పరుగులతో దేశం యొక్క ఏడవ అత్యధిక పరుగుల స్కోరర్ చేసిన క్రికెటర్గా రిటైర్ అయ్యాడు,

ఇందులో 36.47 యొక్క సగటు రన్ స్కోర్ తో, 14 సెంచరీలు మరియు 52 అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఇప్పటివరకు ప్రముఖ భారత క్రికెటర్, యువరాజ్ సింగ్ 27 కి పైగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు ఆడి 2011 వరల్డ్ కప్ లో తన సత్తాని చూపించాడు.

2007 టీ20 టోర్నీలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఉన్నాడు.తిరిగి 2017 వరల్డ్ టీ20లో దక్షిణాఫ్రికాలో , ఇంగ్లాండ్ పై ఆడుతున్నప్పుడు 12 బంతుల హాఫ్ సెంచరీని కొట్టాడు రికార్డుని నెలకొల్పాడు.
Source: Gaadiwaadi


Click it and Unblock the Notifications








