ఓలా క్యాబ్ ఈస్ బ్యాక్ ...
ఓలా క్యాబ్లపై విధించిన నిషేధం కర్ణాటక ప్రభుత్వం ఎత్తివేసింది. ఇది కొన్ని రోజుల క్రితం ఓలా కాబ్లకు ఉన్నటువంటి అగ్రిగేటర్ నిబంధనలను పాటించనందువల్లన రాష్ట్ర రవాణా శాఖ నుండి ఓలాపై విధించిన నిషేధం ఇదివరకే తెలిసిందే.

మీడియా కథనాల ప్రకారం అలా విధించినటువంటి నిషేధం 18 మార్చ్ 2019 న అమలుచేసింది తరువాత 24 మార్చ్ 2019 ఈ నిషేధాన్ని రద్దు చేసింది.తిరిగి తమ వాహనాలను ఓలా క్యాబ్ వారు నడుపవచ్చునని అనుమతిని ఇచ్చింది.

కర్ణాటక ప్రభుత్వం రెండు చక్రాల వాహనాలను కూడా నిషేధించడం వల్ల మిగిలినటువంటి ఉబర్ లాంటి సంస్థలు ముందంజ వేసాయి.ఆరు నెలల పాటు ప్రభుత్వం ఓలా లైసెన్సును సస్పెండ్ చేసింది మరియు వెంటనే దాని ఆపరేషన్లను ఆపడానికి క్యాబ్ అగ్రిగేటర్ను కోరింది, తరువాత ఓలా అధికారులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు.

కర్నాటక సామాజిక సంక్షేమ మంత్రి , మార్చ్ 24 న ట్వీట్ ర్లో, "ఓలా క్యాబ్లు ఈరోజు నుంచి తమ వ్యాపారాన్ని నడపవచ్చుఅని, అయితే నూతన సాంకేతికతలతో పాటు పరిశ్రమల విధానాలకు ఓలా అవసరం ఉంది. నూతన విధానాలను రూపొందించడానికి సహాయం చేస్తామని ఓలా అధికారులకు చెప్పారు.

మంత్రి తన ట్వీట్లో పేర్కొనిన తరువాత ఓలా క్యాబ్లు ఎప్పటిలాగే తమ సర్వీస్ ను కొనసాగించవచ్చ అనే స్పష్టత వచ్చింది. రవాణాశాఖ అధికారులతో సమావేశాలు జరిగిన తరువాత,ఈ నిషేధంకు పరిష్కారం దొరికింది.

ఓలా క్యాబ్ ఆరు రోజుల నిషేధం తరువాత కొన్ని విశేషాలు
బెంగుళూరులో అతిపెద్ద కాబ్ అగ్రిగేటర్ ఓలా సంస్థ మరియు దీని ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడనే ఉంది. ఏదేమైనా, ప్రపంచంలోని అతిపెద్ద క్యాబ్ అగ్రిగేటర్లలో ఒకటైన ఉబెర్ నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ఓలాపై నిషేధం ఖచ్చితంగా ఉబెర్ కొన్ని రోజులు మొదటి స్థానంలోకి వచ్చింది.

ఇప్పుడు ఓలా తిరిగి వ్యాపారంలో రావడం తో,పోటీ కొనసాగించడం జరుగుతుంది.ద్విచక్ర వాహనాల టాక్సీ వ్యాపారము అనుమతించబడడంతో భారత దేశంలోఅన్ని రాష్ట్రాలలో అభివృద్ధి చెందుతుంది. కర్ణాటకలో రెండు చక్రాల టాక్సీలుకూడా పనిచేయవచ్చు అని ఓలా పేర్కొన్నది.


Click it and Unblock the Notifications








