Just In
- 35 min ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 1 hr ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 3 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 4 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
Don't Miss
- News Rahul Gandhi: ఇది నా గ్యారంటీ-సీబీఐ, ఈడీలకు రాహుల్ వార్నింగ్-బీజేపీ సర్కార్ మారగానే..!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
హ్యుందాయ్ తో కలిసి చౌక ధరకే ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్న కియా
కియా మోటార్స్ భారత మార్కెట్ కు తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను వెల్లడించింది. మాతృ సంస్థ హ్యుందాయ్ భాగస్వామ్యంతో తక్కువ ధరకే అభివృద్ధి చేయనుంది. అది ఎటువంటి విధానాన్ని అని పేర్కొనలేదు. అయితే, వారు తక్కువ ధరకే పేర్కొన్నారు కాబట్టి, ఇది ఒక చిన్న హ్యాచ్ బ్యాక్ అని సులభంగా చెప్పవచ్చు.
వివిధ సెగ్మెంట్లలో వాహనాలను లాంచ్ చేసే ప్రణాళికలతో కియా మోటార్స్ భారత్ లోకి ప్రవేశించింది. 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో లో కొరియన్ కార్ల తయారీదారుడు రెండు సంవత్సరాల కాల వ్యవధిలో నాలుగు కొత్త ఉత్పత్తులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నాలుగు ఉత్పత్తులు వేర్వేరు రకాలని, వివిధ సెగ్మెంట్లలో పోటీ చేస్తాయని భావించవచ్చు.
ఇంతకు ముందు ఈవెంట్ ల్లో, కియా భారతదేశంలో ఒక వ్యక్తిగత సంస్థగా ప్రవేశిస్తుందని మరియు ప్రొడక్ట్ డెవలప్ మెంట్ పరంగా దాని మాతృ సంస్థ హ్యుందాయ్ కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. అయితే ఇప్పుడు పరిస్థితులు ఆసక్తికరమైన మలుపు తీసుకువచ్చాయి.
హాన్-వూ పార్క్ (సిఇఓ, కియా మోటార్స్ కార్పొరేషన్) మాట్లాడుతూ, "మేము ఇంకా తక్కువ ఖర్చుతో ఈవి లను ఎలా తయారు చేయాలనే దానిపై పని చేస్తున్నాం. హుందాయ్ తో కలిసి భారతీయ మార్కెట్ కొరకు ఈవి అభివృద్ధి చేయాలని నేను ఆలోచిస్తున్నాను. "హ్యుందాయ్ మరియు కియా రెండూ దక్షిణ కొరియా నుండి రెండు బ్రాండ్లుగా ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ఖ్యాతిని కలిగి ఉన్నాయి.
రెండు బ్రాండ్లు విడివిడిగా అభివృద్ధి చెందాయి మరియు వివిధ అంతర్జాతీయ మార్కెట్లలో పెద్ద షేర్లను కలిగి ఉన్నాయి. భారతీయ మార్కెట్ కొరకు తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేయడం కొరకు కియా మరియు హ్యుందాయ్ కలిసి రావడం అనేది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విభాగం అద్భుతాన్ని సృష్టించ వచ్చు.
అయితే, ఇందులో ప్రభుత్వం పెద్ద పాత్ర పోషిస్తుందని పార్క్ పేర్కొనడం గమనార్హం. అతను ఇంకా ఇలా అన్నాడు, "మేము భారతదేశంలో ఈవి కారును ప్రవేశపెట్టటానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఇది మౌలిక సదుపాయాలు మరియు ప్రభుత్వ మద్దతు పై ఆధారపడి ఉంటుంది.
Most Read: కారులో చిక్కుకుపోయిన చిన్నారి....2 గంటల తరువాత ఏంజరిగిందంటే?
మార్కెట్ అవకాశమున్న సమయంలో, మేము ఈవి ను ఎప్పుడైనా భారతదేశానికి పరిచయం చేస్తాము "భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ ప్రోత్సహించడానికి దాని సామర్థ్యంలో ప్రతిదీ చేస్తోంది. ఇందులో ఫేమ్-II పథకం కింద ప్రభుత్వం రూ. 10,000 కోట్లు ఈవి కొనుగోలుదారులకు సబ్సిడీలుగా కేటాయించింది. అయితే ఈ సబ్సిడీలు కేవలం ద్విచక్ర వాహనాల ప్రైవేట్ కొనుగోలుదారులకు మాత్రమే కేటాయించాయి.
Most Read: ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికీ కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.....!
వాణిజ్య అవసరాల కోసం నాలుగు చక్రాల వాహనాలను కొనుగోలు చేసేవారు సబ్సిడీని వినియోగించుకోవచ్చు, కానీ ప్రైవేట్ వినియోగానికి కొనుగోలు చేయాలని కోరుకునే వారు కాదు. అందువల్ల, ఏదైనా పురోగతి సాధించాల్సి వస్తే, ప్రయివేట్ యాజమాన్యత కలిగిన ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ గురించి ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదని హన్ వూ పార్క్ నొక్కి వక్కాణించారు.
Most Read: పెట్రోల్ కు బదులుగా కోకాకోలా నింపేసాడు...తరువాత ఏమి జరిగింది?
ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్ల కోసం సోల్ ఈవి ను చేస్తుంది మరియు దీనిపై సహేతుకమైన విజయం కనిపించింది, కానీ అది భారతదేశం లో అసెంబుల్ అయినా లేదా ఇక్కడ తయారు చేసినా, అది ఇప్పటికీ చాలా ఖరీదైనది అవుతుంది. అందువల్ల, కియా, హ్యుందాయ్ సహకారంతో ఇప్పుడు తక్కువ ఖర్చుతో కూడిన ఈవి లను అభివృద్ధి చేయనుంది.