బొమ్మ కార్ తో హైవే లోకి దూసుకెళ్లిన చిన్నారి..!
భారతీయ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి ఎందుకనగా చిన్నవయస్సు లోనే చాలామంది డ్రైవింగ్ చేయడం వల్లన మరియు వారికి సరిఅయిన అవగాహనా ఉండదు కూడా ఏదేమైనప్పటికీ,ఈ విచిత్రమైన సంఘటన మన విజయవాడలో జరిగింది.

వివరాలలోకి వెళితే 5 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్నారి బొమ్మ కారు తో ఆడుకొంటూ హైవే రోడ్ పైకి వెళ్ళాడు.దీనిని గమనించిన ట్రాఫిక్ అధికారులు దానిని అడ్డుకొన్నారు.ఇటువంటి సంఘటన జరుగుతున్నది అని ఎవ్వరు ఉహించి ఉండరు,కానీ భవిష్యత్ లో జరగకుండా తల్లిదండ్రులు కఠినం గ ఉండాలని పోలీస్ లు కోరారు.

ఈ సంఘటనతో చిన్నారికి మరియు రోడ్డు మీద ఇతర వాహనాలకు ప్రమాదకరమైనదిగా మారిపోయింది. ఇటువంటి విద్యుత్ బొమ్మ వాహనాలు భారతదేశంలోని రహదారులపై చట్టబద్ధంగా అనుమతిని ఇవ్వరు.తల్లిదండ్రులు ఇలాంటి బొమ్మ కార్లు మరియు సైకిళ్లను పిల్లలకు ఇచ్చినప్పుడు వారిని దగ్గర ఉండి చూసుకోవాలి.

చాలామంది పిల్లలు తగినంత పరిపక్వం చెందిన వారు కాదు కావున ఇలాంటి పనులు చేస్తే ప్రమాదాలను జరుగుతాయని వారు అర్థం చేసుకోరు కూడా మరియు వారిని సురక్షితంగా ఉంచడం తల్లిదండ్రుల బాధ్యత.ఈ సంఘటన విజయవాడ-బెంజ్ సర్కిల్లో అత్యంత రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్లలో జరిగింది.
చిన్నారి పసుపు చొక్కా మరియు నీలం రంగు ఎలక్ట్రిక్ బొమ్మ కార్నితీసుకొని బెంజ్ సర్కిల్లోని బహిరంగ రహదారిపై వెళ్ళాడు, ఇది భారీ ట్రాఫిక్ జామ్కు కారణమైంది. బొమ్మ కారులో ఉన్న చిన్నారికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండటానికి వాహనదారులు అందరూ ఆగిపోయారు, ఇది రోడునంతా బ్లాక్ చేసింది.

బాలుడి యొక్క రక్షించడానికి స్థానిక ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు.పిల్లవాడి యొక్క బొమ్మ కారు బాటరీ తో పనిచేస్తుంది మరియు రిమోట్ లేదా స్టీరింగ్ ద్వారా నియంత్రించబడుతుంది అని పోలీస్ లు తెలిపారు.

బాలుడు అక్కడి నుంచి కనీసం ఒక కిలోమీటరు దూరంలో ఉన్నాడు అని మరియు అతను ఇంటిని విడిచిపెట్టి,రహదారిలో ఉన్నాడని అతని తల్లితండ్రులు గ్రహించలేదు. కొంతమంది పాదచారులు పిల్లలను గుర్తించారు మరియు ట్రాఫిక్ SI జగన్నాథ్ రెడ్డి అతను ప్రమాదం నుంచి సురక్షితమని నిర్ధారించడానికి అక్కడికి చేరుకున్నారు.


Click it and Unblock the Notifications








