హ్యుందాయ్, మహీంద్రా లకు సవాలుగా మారుతీ సుజుకి కొత్త ప్రణాళిక
మారుతి సుజుకి విటారా బ్రెజ్జా చాలా కాలం నుండి భారతదేశం యొక్క బెస్ట్ అమ్మకాలలో సబ్-4 మీటర్ ఎస్యువిగా నిలిచింది. అది ఫోర్డ్ ఎకోస్పోర్ట్, టాటా నెక్సన్, మరియు మహీంద్రా ఎక్స్యూవి300 సెగ్మెంట్లో పోటీగా నిలిచింది. ఇప్పటి వరకు బ్రెజ్జా అమ్మకాల పరంగా మొదటి స్థానంలో నిలిచింది.

సగటున మారుతీ సుజుకికి ప్రతి నెలా సుమారు 15,000 యూనిట్ల ఈ సబ్-4 మీటర్ ఎస్యువిని విక్రయించింది. హ్యందాయ్ భారతదేశంలో వెన్యూ ను ప్రారంభించనంత వరకు దీని అమ్మకాలు బాగానే జరుగుతున్నాయి. గత నెల అమ్మకాల సంఖ్య అమాంతరం తగ్గుమొఖం పట్టింది, మారుతీ సుజుకి కేవలం 8,000 యూనిట్ల బ్రెజ్జా విక్రయించింది, హ్యుందాయ్ దాదాపు అదే యూనిట్ లను బ్రెజ్జా వలె విక్రయించింది.

ఈ కొత్త సవాలును ఎదురుకోవడానికి మారుతి సుజుకి ఇప్పుడు వితారా బ్రెజ్జా మీద 5 సంవత్సరాల సమగ్ర వారంటీ ను అందిస్తోంది. ఇప్పటి వరకు మారుతీ సుజుకి రెండు సంవత్సరాల స్టాండర్డ్ వారెంటీని, వితారా బ్రెజ్జా మీద 40,000 కి.మీ. దూరం వరకు ఇచ్చింది. అయితే ఇప్పుడు

ఐదు సంవత్సరాలు మరియు ఒక లక్ష కిలోమీటర్ల వరకు పొడిగించబడ్డ వారెంటీ లను ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు ఈ కొత్త ఆఫర్ తో మారుతి ఖచ్చితంగా తన డీలర్ షిప్ లకు మరింత మంది కొనుగోలుదారులను రప్పించేందుకు ప్రయత్నిస్తోంది.

కొన్ని వారాల క్రితం మారుతీ కూడా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు వితారా బ్రెజ్జా అనే ' స్పోర్ట్స్ లిమిటెడ్ ఎడిషన్ ' వేరియంట్ ను లాంచ్ చేసింది. ఇది స్పోర్టివ్ డెకల్స్ మరియు బాడీ కిట్ కలిగి ఉంది, ఇది దాని యొక్క లుక్ ని చాల అందంగా మార్చేసింది.

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
వెన్యూ విషయానికి వస్తే, సబ్-4 మీటర్ ఎస్ యువి దాని ప్రారంభం నుండి చాలా మంచి విక్రయాలను నమోదు చేస్తోంది మరియు రాబోయే కొన్ని నెలలో కారు అమ్మకాల పరంగా వితారా బ్రెజ్జా ఓవర్ టేక్ చేయగలదా అని కనపడుతోంది.

వెన్యూ లో ఉన్న ప్రధాన లాభంలో ఒకటి, దాని బేస్ మోడల్ ధర వితారా బ్రెజ్జా కంటే దాదాపు రూ. లక్ష తక్కువ. ఇది ఫీచర్లు తక్కువగా ఉండగా, రూ. లక్ష వరకు ఆదా చేయడం అనేది మొదటి సారి కొనుగోలుదారులకు ఎంతో ఆకర్షించింది.

అన్నింటిని మించి, మార్కెట్ లో మరింత కొత్త వాహనం కావడం వల్ల, బ్రెజ్జా లో లేని ఫీచర్ల వెన్యూలో ఉన్నాయి. మారుతీ సుజుకి వారు చేసిన ఈ ప్రయత్నాలు తన అమ్మకాలను మరింత పెంచుతాయో లేదో చూడాలి.

ఇప్పటికి ఈ ఏడాది పండుగ సీజన్ లో లాంచ్ కావాల్సి ఉన్న వితారా బ్రెజ్జా అనే పెట్రోల్ పవర్డ్ మోడల్ పై కూడా తయారీదారు కసరత్తు చేస్తోంది. కొత్త నిబంధనలలోకి వచ్చిన తర్వాత డీజిల్ ఆధారిత కార్లను అమ్మడం ఆపేస్తామని గతంలో మారుతి ప్రకటించింది.

మారుతీ సుజుకి వారు 1.2-లీటర్ ఎస్యువి పెట్రోల్ ఇంజన్ ను వితారా బ్రెజ్జా వాడుతుందని భావిస్తున్నారు. ఈ కొత్త 1.2-లీటర్ డ్యూలజెట్ ఇంజన్ సుమారుగా 91 బిహెచ్ పి పవర్ మరియు సుమారుగా 120 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేయును.

ఇప్పటి వరకు మారుతీ సుజుకి వితారా బ్రెజ్జా 1.3-లీటర్ డీజల్ ఇంజన్ తో పవర్ ఫుల్ గా 89 బిహెచ్ పి గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసి 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అవుట్ పుట్ ను ఇస్తుంది.


Click it and Unblock the Notifications








