Just In
- 4 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 6 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 7 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 9 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ముంబై ట్రాఫిక్తో చచ్చిపోతున్న జనం ఎలానో చూడండి..!
భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై లో ఇపుడు కొత్త సమస్య వచ్చి పడింది. అది ఏమిటంటే ఇక్కడ ప్రతి కిలోమీటరుకి 501 కార్ లు ఉన్నాయి దీనిని జాతీయ రాజధాని ఢిల్లీ తో పోలిస్తే 5 రేట్లు ఎక్కువగా ఉన్నదీ. అందువల్లన ఎక్కువ ట్రఫిక్ అవ్వడంతో నగర జనాభాకు చాల కష్టంగా మారిపోఇంది.
టైమ్స్ అఫ్ ఇండియా ప్రకారం,ముంబైలో రహదారి స్థలం లేనందున వాహనాల యొక్క సాంద్రత ఎక్కువైనది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న వాహనాలు వాటి కోసం రోడ్డు స్థలం లేకపోవటం వలన భారీ ట్రాఫిక్ జామ్లు, కాలుష్యం మరియు అనధికార పార్కింగ్లు దాదాపు ప్రతిచోటా ఏర్పడుతున్నాయి,దీని వలన చాలా నేరాలు మహారాష్ట్ర రవాణా శాఖలో నమోదు అవుతున్నాయి.
రవాణాశాఖ నిపుణుడు అశోక్ దాతార్ మాట్లాడుతూ "ముంబై గత కొద్ది సంవత్సరాలుగా ఈ ఇబ్బందితో సతమతం అవుతున్నది,అలాగే ప్రైవేట్ కార్ల కొనుగోలుపై ఎలాంటి నియంత్రణ లేనందువల్లన, నగర రహదారిలో ప్రయాణించడం ఒక పీడకలగా మారింది " అని తెలిపారు. అశోక్ ఉపనగరాలలో రవాణా కోసం బస్సులు ఉపయోగించాలని చాలాసార్లు వాదించారు.మహారాష్ట్ర రవాణాశాఖ అధికారులు 2016 నాటికి కిలోమీటరుకు 430 కార్ల వద్ద ఉన్నాయని, ఇప్పుడు అవి 510 కు పెరిగాయని అలాగే ప్రైవేటు రిజిస్టరు చేసుకొన్న కార్ల సంఖ్య 10.2 లక్షలకు చేరిందని తెలిపారు. ఇది సుమారు ముంబయిలోని మొత్తం కార్ల సంఖ్యలో 28% కు చేరుకొంది.
ముంబైలో ఎన్విరాన్మెంటల్ సోషల్ నెట్వర్క్ ద్వారా జరిపిన అధ్యయనంలో 49% రోడ్ ప్రదేశం ప్రైవేటు వాహనాలచే ఆక్రమించబడింది. ట్రాఫిక్ రద్దీగా పెరగడానికి ఇది ఒక పెద్ద కారణం గ చెప్పవచ్చును. అలాగే పాశ్చాత్య ఎక్స్ప్రెస్ రహదారిలో గరిష్ట వేగంతో 10kmph కు పడిపోవటంతో ఇది సగటు వేగంగా మారింది.RTO అధికారుల మేరకు గరిష్ట కారు రిజిస్ట్రేషన్లు పాశ్చాత్య శివార్లలో ఉండగా, తరువాత తూర్పు శివారు ప్రాంతాలు ఉన్నాయి. పావై మరియు చెంబూర్ వంటి శివారు ప్రాంతాలకు చాలా కార్లకు గరిష్ట రిజిస్ట్రేషన్ ఉందని పేర్కొన్నారు, దాదాపుగా ప్రతి ఇంటిలో కనీసం ఒక నమోదిత కారు కలిగి ఉంది. దీనికి అదనంగా, తూర్పు చెంబూర్ నుండి సౌత్-బాంబే మార్గం లో ఎక్కువ మంది ఇష్టపడే మార్గంగా చెప్పవచ్చు,ఎందుకంటే ఇది ప్రయాణ సమయమును అరగంటకు తగ్గిస్తుంది.
Most Read: బైక్ స్టంట్ చెసినవాళ్ళను నడిరోడ్డులో కుమ్మేశారు
మలబార్ హిల్ లేదా నెపాన్ సీ రోడ్-పెదర్ రోడ్ బెల్ట్ తో పోలిస్తే కొలాబా-కఫే పెరేడ్ బెల్ట్ భారీ వాహన జనాభా కలిగి ఉంది. అలాగే, ఆంధేరి మరియు గోరేగావ్ నివాసం మరియు వ్యాపార కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడ వాహనాల సంఖ్య ఒక్క సంవత్సరాల్లో పెరిగింది. కండివాలి, బాంద్రా, మరియు బోరివాలి పెద్ద కార్లను కొనుగోలు చేసే వారు ఎక్కువ
ప్రైవేటు కార్ల సంఖ్య పెరగడంతో రవాణా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ఈ పెరుగుదల ప్రజా రవాణాను దెబ్బతీస్తుంది. ప్రైవేటు వాహనాల సంఖ్య పెరగడం వల్ల పార్కింగ్ సమస్యలకు దారితీస్తుందని వారు భావిస్తున్నారు. "కొత్త పార్కింగ్ విధానాన్ని అమలు చేయడానికి, పార్కింగ్ రంగాల్లో రద్దీ పన్నును విధించేందుకు ఒక పార్కింగ్ అధికారం ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది" అని ముంబై ట్రాన్స్పోర్ట్ ఫోరం యొక్క ఏ.వి.షెనోయ్ తెలిపారు.
Most Read: నల్లమల అడవుల్లో ఉన్న వేలాడే రైలు వంతెన గురించి ఆసక్తికరమైన నిజాలు
ముంబయిలో కార్ల సంఖ్య పెరుగుదలను నియంత్రించే మార్గాలను ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు సూచిస్తున్నారు. వారు వ్యక్తిగత వాహనాలను నడపడం నుండి స్థానికులను నిషేదించారు. అనేకమందికి మెట్రో కారిడార్లు ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మరో అధికారి తెలిపారు. ఇది సులభమైన ట్రాఫిక్ పరిస్థితులు మరియు సున్నితమైన ప్రయాణాన్ని మరియు ప్రజా రవాణాను ప్రోత్సహిస్తుంది.పూణే తదుపరి సంఖ్య కలిగిన నగరం, తరువాత కోల్కతా, చెన్నై మరియు బెంగుళూరు ఉన్నాయి.